29, డిసెంబర్ 2009, మంగళవారం

Godavari River - Altitude profile

Using topocoding.com's API available to map the altitudes, I created the profile of Godavari River's altitude.

The starting point is at Basara ( AP-Maharastra border) from where Godavari flows exclusively in AP and the end point is Bay of Bengal, where it terminates at yanam.




This total length, according to the profile plot, is about 720 kms.

You can see that there is one minor dip in the above Figure. It corresponds to Sriram Sagar (@ nearly 72kms) and this is only gravity dam built on Godavari.

Overall, Krishna drops from 1100ft+ (310mts+) to sea level in its entire journey in AP (starting just before Basara).

note: Ignore those spikes in the Figure. Knots just wandered a little bit while tracing Godavari in the map. They are just measurement errors.

Krishna River - Altitude profile

Using topocoding.com's API available to map the altitudes, I created the profile of Krishna River's altitude.

The starting point is at the tip of Karnataka and AP (Mehboob Nagar Dst.) from where Krishna flows exclusively in AP and the end point is Bay of Bengal, where Krishna terminates.

The total length, according to the profile plot, is about 582 kms. If you add about another 50+ kms of Karnataka-AP border, length of Krishna in AP will be about 630+ Kms. Of which, about 100kms exclusively flows in Telangana. Therefore, only less than 1/6th (or ~ 17%) of Krishna exclusively flows in Telangana. 70% of Krishna flowing Telangana, though factual, gives a wrong impression.

Shown below is the profile plot of Krishna River that flows between upstream Jurala and Bay-of-Bengal.



You can see three major dips in the plot, immediately followed by flat regions. They correspond to Jurala (@ nearly 20kms), Srisailam (@ nearly 180kms) and Nagarjuna Sagar (@ nearly 300kms). There is another flat region starting at nearly 400ksm, that should be the Prakasam barrage.

Overall, Krishna, drops from 900ft+ (300mts+) to sea level in its entire journey in AP (starting just before Jurala).

note: Ignore those spikes in the Figure. They are because, knots just wandered a little bit while tracing Krishna in the map. They are just measurement errors.

Disadvantage - Seema/Talangana



Shown above is the topological map of Andhra Pradesh.

  • Majority of telangana-seema is in the high altitude region. The Deccan peninsula is inclined eastwards (this makes me think that right canals would irrigate more area than left canals) making it much difficult to irrigate telangana region sandwiched between Godavari and Krishna. In which case, gravity based canals would be effective, only if they originate at the farthest points eastwards or northeastwards. But availability of water always decreases as we move upstream.
  • It would be much easier to construct and operate canals in the coastal delta.
  • It is not a coincidence that backward regions in AP have similar altitudes (or at least, have chunks of it) irrespective of whether rivers flow in those regions.
  • Building canals and water ways is a populist idea and conceptually looks good. But it is not as simple as building concrete highways/information highways or drawing imaginary political maps.

Krishna:

  • It is true that about 70% or more of both Krishna and Godvari flow in Talangana. However, this could lead to incorrect notions about the available water up-stream.
  • Only a stretch of Krishna flows exclusively in Telangana (in Mehboob Nagar Dst). The remaining stretch is shared (boundary) either by Seema/Karnataka or flows exclusively in Kosta (Guntur/Krishna Dsts.)
  • Its major tributary ( other than Bheema) Tunga-Bhadra joins Krishna at Kurnool-Mehboob Nagar boundary and since then it becomes a shared resource as mentioned before
  • Krishna-water basin is under closure, which means that the available water is being utliized completely or is fully committed. The only way new projects can be taken-up is by limiting/reducing already committed/serviced areas.
  • Circa 1951, Bombay state received an entitlement of 240tmcf, Mysore state 10 tmcf, Hyderabad state 280 tmcf, and Madras state 470 tmcf of Krishna water.
  • Krishna-1 and 2 projects near Akkampally are providing drinking water to Hyderabad from Nagarjuna Sagar. Apparently, these pipelines go through Naglonda district. My view is that there is not much water left for Nalgonda. Otherwise, drinking water could be supplied to Nalgonda form this project.
  • Krishna is not a perennial river and depends much on the rainfall in the western-ghats. It is only natural that downstream areas benefit from this. Nature does not care about politics but only follows the laws of Physics.
  • The K-C canal connects Krishna and Penna. A section of the Telugu-ganaga project is another link (terminating at Somasila on Penna)

Godavari:

  • Unlike Krishna, Godavari is not easy to tap, again due to its geography. Many of its main tributaries flow on the other side of the Godavari (except Manjira and few small tributaries). Like Krishna, it also depends on rainfalls (in Maharastra, Chattisghad and Orissa which make up much of the catchment area).
  • So far, only two alternate locations suitable for gravity-dams were identified upstream Dhavaleswaram, other than Sriram sagar. They are itchampally and polavaram. (Itchampally proposes to link Godavari with Krishna @ Nagarjuna Sagar)
  • Polavaram project was proposed and surveyed in the early 1940s. As per current drawings, it's left canal connects Krishna at Prakasam Barrage. It also hopes to provide 960MW (for lift projects upstream). But now a days, there is huge criticism for large projects, questioning their utility as a whole.
  • Itchampally was put on back burner due to political reasons and Polavaram was started without obtaining proper clearances. Only a man like YSR could do that. Prof. Kodandaram, who was convening the JAC, fiercely opposed Polavaram, citing environmental issues. It would be interesting to see what his take will be for the itchampally project
  • Around 40% of the annual discharge occurs just in a matter of few weeks during monsoons. This makes it very difficult to tap Godavari water.
  • Around, 90% of Godavari's discharge is due to the catchment area downstream Sriram sagar.

BASED on:

[1] Reforms in "Hyderbad Metropolitan Water Supply and Sewage board"
[2] Modeling water supply and demand scenarios: Godavari-Krishna inter-basin transfer, India
[3] Drawing water for thirsty lands: Stories of the closing Krishna river basin in south India
[4] Sponge city: water balance of mega-city water use and wastewater use in Hyderabad, India
[5] A History of water: water control and river biography
[6] Perspectives on Polavaram
[7] and my (poor) ability record, recall, process and analyze information


[1-4] WWW
[5-6] Google books or your library


IN the hope that it clears or creates more confusion,
BY an idiot who doesnt say "All is Well"
BUT says,
"We romanticize our rivers very much. Godavari at Basara pales in comparison to the Akhanda Godavari near Rajamundry. Only man-made diversions, with their bag of problems and destruction, can bring Konaseema/Diviseema greenery to the dry uplands".
Choice is ours.

27, డిసెంబర్ 2009, ఆదివారం

ఊహాజనిత విభజన రేఖలు



ఈ ఫొటొ, ఆం.ఫ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంనాడు తెలంగాణా లో ఒక చిన్నారి వేషం. ఈ రోజు సమైక్యతారాగం ఆలపిస్తున్న అధిక ప్రజలు కూడా, తెలంగాణా విడిపోతామంటే ఇలాంటిక్షోభనే అనుభవిస్తున్నారు. మా పరిస్థితి ఈ చిన్నారికి, పరోక్షాంగా ప్రభవితులైన భావి భారత పౌరులకు ఎదురుకాకూడదని కోరుకుంటున్నాను.

మరొక వైపు, తెలంగాణాకు అడ్డొస్తే, అడ్డంగా నరుకుతాం అంటూ నినాదాలూ. ఇది అణచివేతకి ప్రతిరూపమా, విధ్వేషానికి పరాకాష్టా?

హు ...

ఊహాజనిత రేఖలు - ఊహలకందని కల్లోలం
ఎందుకీ సమైక్య రాగం
ఎందుకీ విభజనవాదం
నాకెందుకీ ఆరాటం, ఎవరికోసం?

26, డిసెంబర్ 2009, శనివారం

గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణా


ఇలాంటి గోడని సరిహద్దు ప్రాంతమంతా కట్టి, గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణా నిర్మించిన విప్లవ వీరులుగా ఖ్యాతి గడించి, చరిత్ర పుటల్లో స్థానం సంపాదిద్దామా?

లేక

వీటిని కూలగొట్టి, అభివృద్ధికి ఇవే అసలైన అడ్డు గోడలని ఋజువు చేద్దామా?

23, డిసెంబర్ 2009, బుధవారం

ఘోషయాత్రలో సమైక్యతారాగం - అరణ్య రోదన

who moved your cheese Prof. Jayashankar?

నా ప్రశ్న కి వివరణ


నేను తెలాంగాణా వెనుకబాటుతనంపై ఉద్యమాన్ని వ్యతిరేకించటంలేదు. అందుకు, మీరెంచుకున్న మార్గమేంటీ, చేరబోతున్న గమ్యమేంటి. ఈ ఉద్యమానికి రాజు కె.సీ.ఆర్ అయితె, ప్రొ. జయశంకర్ & కో మంత్రులు లాంటి వారు.

ప్రొ. జయశంకర్ గారు, వైస్ చాన్సలరు గానే కాకుండా అనేక ఉన్నత స్థానాల్లొ, విద్యాలయాలలకి సలహాలూ, సూచనలూ ఇచ్చిన వ్యక్తి. దశబ్దాలనుంచీ తెలంగాణా వెనుకబాటుతనంపై పోరాటం చేస్తున్న వ్యక్తి.

ఉద్యమం దారి తెప్పిందని నేను నమ్ముతున్నాను. కాబట్టి సిద్ధాంత కర్త సిద్ధాంతాల్ని ప్రశ్నిస్తున్నాను. దీన్ని పొగరుబోతుతనం అన్నా పర్వాలేదు. ప్రశ్నినించే అర్హత, హక్కుల మాటకొస్తే, ఆం.ఫ్రా, నా రాష్ట్రం, ఇలా తగలబడిపోతూ ఉంటే, గళం విప్పడం నా బాధ్యత. ఒక విధ్యార్ధిగా ప్రశ్నించించడం నా ప్రాధమిక హక్కు. ప్రశ్నల్ని స్వాగతించడం ఆచార్యుల కనీస బాధ్యత.

సమైక్యత అంటే, తెలంగాణా ని విమర్శించడతనం కాదు. విభజన పరిహ్కారం కాదు అని భావిస్తున్నవాళ్ళ భావం. మీ నోటి కింద కూడు లాక్కునే దుర్మార్గపు ఆలోచనలు మాలాంటి సామాన్యులకి ఇంకా అబ్బలేదులెండి. దయచేసి ఇలాంటి పసలేని ఆరోపణలు చెయ్యకండి.

రాజకీయనాయకులు, కిలో రెండు రూపాయలు, ఉచిత విద్యుత్తు, భూమి పట్టాలు, కలర్ టీవీలు అంటూ ప్రజలని ప్రలోభపెట్టి వాళ్ళని సోమరిపోతులని చేస్తున్నాయి. రాష్ట విభజన. ఈ తాయిలాన్ని ఒక సిద్ధాంత కర్త ఆమోదించడాన్ని నేని ప్రశ్నిసున్నాను,

ఇంక విద్యార్ధులెన్ను కున్న మార్గాలు. ఓ.యూ లో ధర్నాలు, బస్సులు పగలగొట్టడాలూ. పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లు, మిగతా ప్రాంత విద్యార్ధులు కూడా అదేపని. ప్రాంతాలకతీతంగా, పట్టుమని పదహారేళ్ళులేని ఆడ పిల్లలు, పరప్రాంత నాయకుల దిష్టిబొమ్మలని తగలబెట్టడం, వాటిని చెప్పులతో కొట్టడం. ఈ విష సంస్కృతిని మనం ఆదరిస్తున్నాం. అమ్మాయలపై రౌడీ మూకల ఏసిడ్ దాడులకి దీనికి మీకు సారూప్యత కనిపించడం లేదా? పెట్టిన కేసులు ఎత్తివేయాలని మరిన్ని ధర్నాలు. ఉద్యమాలు విద్యార్ధుల చేతిల్లోకి వెళ్ళిపోయిందని జబ్బలు చరుచుకోవడాలూ. అంటే, మనం ఇప్పటినుంచే చట్టాన్ని తుంగలా తొక్కే చట్టుబండ నాయకులని చప్పట్లు కొట్టి మరీ తయారు చేస్తున్నాము కదా?

ఇంతకీ అసలు ఏమి అభివృద్ధిని మీరు కాంక్షిస్తున్నారు. కోస్తా సీమాల్లో ఉన్న అభివృద్ధి ఒక మేడి పండు లాంటిది. కాలేజీలు కోస్తాలో ఉన్నన్ని లేవు అని ఎవరో అన్నారు. కాలేజీలు ఎలా నడిపిస్తారో మీకు తెలుసా. అధికారులని కొనేసి, అధ్యాపకులని అరువు తెచ్చుకొని, కాగితాలమీద నడిపిస్తారు. ఇలాంటి కాలేజీలు, చదువులు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఈ విషయాయం మీ ఆచార్యవర్యులకు తెలీదనుకోవాలా? అందుకే విద్యరంగంలో నిపుణులైన మీ సిద్ధాంతకర్త గారి సిద్ధాంతాలని ప్రశ్నిస్తున్నాను.

విభజన ఒక మార్గం. మీరు పోరాడవలసిన అసలు సమస్య ఇది కాదు, అని నా విశ్వాసం. ఇది చెప్పడానికి సమైక్యవాదినే అవ్వాల్సిన అవసరం లేదు. ఏ భారతీయుడైనా, ఏ మానవుడైనా సూచించ వచ్చు. ఇది సార్వజనీనమైనది.

ఒక వేళ విభజన జరగాల్సిన పరిస్థితి వస్తే, దానికి రాజీ మార్గాలు ఎన్నుకోవాలి. ఎవ్వరూ తగ్గకుండా ఈ జఠిలమైన విభజనకి పరిష్కారం కుదరదు. అందుకు మీరు మానసికంగా సన్నిద్ధులు కండి. విభజన జరిగే పక్షంలో, ఈ మేడి పండు అభివృదిని కాకుండా నిజమైన అభివృద్ధిని కాంక్షించండి.
Replenish your think-tanks
Not just water tanks
ఒక సమైక్యవాదిగా ఇది నా అత్యాశ. నా మాటలు చాలమందికి రుచించవని నాకు తెలుసు. నా సిద్ధాంతాలు తప్పూ కావచ్చు.
ఘోషయాత్రలో సమైక్యతారాగం - అరణ్య రోదన
అన్నదే మీ అభిప్రాయమైనా , విచక్షణ ఉపయోగించి ఆలోచించండి. అది చాలు!

I opposed "dividing the state" Explained/Analyzed why. Suggested a compromise.

I accept any decision.

Peace out.

22, డిసెంబర్ 2009, మంగళవారం

ప్రొఫెసర్. జయశంకర్: మీ వెన్న దొంగ ఎవరు?

కె.సీ.ఆర్ మాటల్లో, ఒక తెలంగాణలో స్కూలు పిల్లవాడినడిగినా చెబుతాడు, "మనకి ప్రత్యేక రాష్ట్రం ఎందుకు చెప్పరా" అంటే, ఇలా
1) తెలంగాణా కి అన్యాయం జరిగింది.
2) భాషను గేలీ చేసేరు.
3) జాతి ని అవమానించేరు.
4) వివక్ష చూపేరు.
5) దురాక్రమణ దారులు శతాబ్దాలుగా దోచుకుతింటున్నారు
...... అంటూ మరెన్నో

ఒక తెలంగాణా చరిత్రకారుణ్ణి అడిగితే,
నాలుగువందల పైచిలుకు సంవత్సరాలుగా, బానిసత్వంలో బతికాం. పాలకుల దాష్టీకానికి గురైన బంగారు పిచుక తెలంగాణా. పోరాటాల పురిటి గడ్డా మా తెలంగాణా + పై పిల్లాడి కారణాలు

ఒక కళాకారుడ్ని అడిగితే,
డప్పుతో దరువేస్తూ, లయబధమైన గజ్జెల జప్పుడుతో,
ఎవడురా, ఎవడురా,
తెలంగాణకు అడ్డెవడురా, + పై పిల్లాడి కారణాలు
అని పాడుతుంటే, ప్రాంతాలకతీతంగా ఎవరికైనా ఉద్రేకం కలుగుతుంది. పోరాట స్ఫూర్తి రగులుతుంది. మేము కూడా పలుపంచుకుంటాం అనాలనిపిస్తుంది. కదా?

పై చెప్పినవాటినే మరొక్కసారి పరీక్షిద్దాం.
-- [ ... నాలుగువందల పైచిలుకు సంవత్సరాలుగా, బానిసత్వంలో బతికాం ...]
-- [ ... పోరాటాల పురిటి గడ్డా మా తెలంగాణా ...]
-- [... ఎవడురా, ఎవడురా,
తెలంగాణకు అడ్డెవడురా ...]

ఇలా నాలుగువందలేళ్ళుగా, పోరాడుతునే వున్నాం. మళ్ళీ పోరాడుతునే వున్నాం.
కానీ ఎవరితో? ఇంకా ఎన్నాళ్ళు? వీటిలో వైఫల్యం ఎవరిది?

ప్రొఫెసర్. జయశంకర్ గారూ.
మనం మనతో పోరాడితే విజయం లభిస్తుంది. తద్వారా, సంఘమూ విజయం సాధిస్తుంది.
ఎదుటి వారితో పోరాడుతూ వుంటే, నిరంతరం పోరాడుతూనే ఉండవలసివస్తుంది. అంతర్గత పోరాటలతో, మహా సామ్రాజ్యాలూ, సంస్కృతులూ మట్టికొట్టుకొనిపోయాయి. పోరాటినికి సై సై అంటున్న సైనికుల భావ బానిసత్వంపై పోరాటం ప్రకటించండి, వారిని విముక్తుల్ని చెయ్యండి. అప్పుడు తెలంగాణ, సీమ, కోస్తాలే కాదు, ఆసేతుహిమాచలమూ కళ కళ లాడుతుంది.

దీన్ని
గాంధీ నిరాహారక్ష తేదు
నెహ్రూ పంచవర్షలు తేలేదు
ఇందిర ఇరవై సూత్రాలు తేనేలేదు
పి.వి. చాణక్యత తేదు
బూర్గుల కలంపోటు తేలేదు
చెన్నారెడ్డి వెన్నుపోటు తేనేలేదు

బాబు గారి ఐ.టి తేదు
వై.ఎస్.ఆర్ జల యఙ్ఞం తేలేదు
ఎన్.టీ.ఆర్ రెండు రూపాయలు తేనేలేదు

అంతే కాదు

జె.పీ స్వపరిపాలనతో రాదు.
చిరు పెను మార్పులతో రాలేదు
రోశయ్య బంట్రోతు బిళ్ళ తేదు
బాబు గారి మౌనం తేలేదు
లగడపాటి ధన యఙ్ఞం తో రాదు
కే.సీ.ఆర్ రాష్ట్ర విభజనతో రాలేదు
మీ సివిల్ వార్ ధంకీలతో అంత కన్నా రాలేదు.

ఒక్క సంస్కరింపబడిన విద్య ద్వారా మాత్రమే సాధ్యం. అటువంటి విశ్వవిద్యాలయాలు మనకి లేవు. వాటిని పోషించే పాలకులు లేరు. ఆ సంపదని అభివృద్ధి పరచే విద్యార్ధులు అసలే లేరు.

మీరు ఆ దిశగా చర్యలు చేపట్టండి.
జై తెలంగాణా అంటూ గొంతెత్తి నినదిస్తాం.
మీ కాలు మొక్కుతాం బాంచెన్

btw, who moved your cheese Prof. Jayashankar?
- ఒక సమైక్యవాది ప్రశ్న

Collapse: How Societies Choose to Fail or Succeed

I wish that everyone engaged with the current state of political affairs in A.P reads the book

"Collapse: How Societies Choose to Fail or Succeed"

by Prof. Jared Diamond


If you dont get a copy of the book, you can watch a video

here

21, డిసెంబర్ 2009, సోమవారం

సమైక్యాంధ్ర ఉద్యమ నిర్వహణలో లోపాలు

సమైక్యాంధ్ర కోసం ఉద్యమం*: ఎందుకు ఎవరితొ, ఎక్కడా, ఎలా?

ఎందుకు:
సగం మంది దగ్గర సమాధానం ఉండదు. (విడిపోవడానికి చెప్పినంతా సులువుగా, కలిసుండడానికి కారణాలు చెప్పడం కష్టం. ఋజువుల సంగతి సరే సరి. ఉదాహరణకి: అణచివేత, వివక్ష, దోపిడీ, ఆత్మగౌరవం. ఎలాంటి వారు విడిపోవడానికైనా, ఈ కారణాలు చెప్తే చాలు కదా!)


ఎవరితో:
మాతో సమైక్యంగా ఉండండని, ఉండగోరే వాళ్ళతో పోరాటం. ఎంత విచిత్రం

ఎక్కడ:
తెలంగాణా వాళ్ళతో సఖ్యతకోసం, సీమ - కోస్తాల్లో. మరీ విచిత్రం

ఎలా:
కొబ్బరి చెట్లు ఎక్కి, శవదహనాలు చేస్తూ, పిండాలు పెడుతూ, పాలాభిషేకాలతో, రైళ్ళు-బస్సులు-సమస్తం - ధ్వంసం చేస్తూ, అర్ధ-నగ్న ప్రదర్శనలు చేస్తూ --
(ఇలాంటి విడ్డూరాలకి మనం అలవాటుపడిపోయాం. తెలంగాణా వాదుల "జాగో-భాగో, " లు తక్కువేమీ కాదనుకోండీ)

ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తోంది. సమైఖ్యతా భావన సడలిపోవడానికి ఇంతకన్నా వేరే కారణాలు కావాలా?


* ఈ టపా బ్లాగుల్లో జరుతున్న చర్చలని దృష్టిలో పెట్టుకుని రాసినిది కాదని మనవి

తెలంగాణా-సమైక్యాంధ్రా ఉద్యమాలకి మూలకారణం ఎవ్వరు?

1) ఏ ప్రాంత ప్రజలైనా స్వార్ధపరులే. అందులోంచి వచ్చిన రాజకీయనాయకులు నీతిమంతులు కావలనుకోవడం అమాయకత్వం.

2) తెలంగాణ వాళ్ళు చేస్తున్న పోరాటం, వాళ్ళకోసమే. వీధినపడి ధర్నాలు చేస్తున్న సమైక్యవాదులు చేసే పోరాటం కూడా, వారి స్వప్రయోజనాల కోసమే

3) మా ప్రాంతం వెనకబడిందంటే, కాదు మాది మాదంటూ, ఇలా వెనుకబాటుతనంలో పోటీ పడుతున్నామంటే, అసలు అభివృద్ధిని ఆకాంక్షించే అర్హత మనకుందా?

4) “ప్రజల మనోభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకునేది మా పార్టీ” అని ఈరోజు ప్రతీ పార్టీ చెప్తోంది. ఇలా ఆలోచించే వాళ్ళు అసలు లీడర్సు, పాలసీ మేకర్స్ ఎలా అవుతారు?

5)* ప్రజలు బద్దకస్థులు. ప్రస్తుత కాలంలో విద్య, రాజకీయాలు, ఈ రెండూ పనికిరాని కుళ్ళిపోయిన వ్యవస్థలు. ఉస్మానియా అయినా, ఆంధ్ర విశ్వవిద్యాలలయమైనా, మరేదైనా, అవినీతి పంకిలాలు*. విద్యార్ధులతో సహా! ఎవడు సరిగ్గా చదివి పాసయ్యాడు? సరిగ్గా క్లాసులకి హాజరౌతాడు? హాస్టల్స్ లో జరిగే అసాంఘిక కార్యకలాపాలకు అసలు లెక్కేదీ? ఈ వ్యవస్థలో ఎవెరు నీతిమంతులు, నిజాయితీపరులు? ఇందులోంచీ పుట్టిన ఉద్యమాలు ఎంత పవిత్రం. (అది ఓ.యూ తెలంగాణా అయినా, ఏ .యూ సమైక్యాంధ్రా అయినా).

6) ప్రతీ మనిషి ప్రభుత్వం మీదే ఆధారపడాలనే పరాధీన మనస్తత్వం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఎదురు చూసి మోసపోవడమే ప్రస్తుత సమాజ దుస్థితి.


ప్రజలచేత, ప్రజలకోసం, ప్రజల కొఱకు ఏర్పడిన వ్యవస్థ ఒక పరిష్కారం చూపలేకపోయింది అంటే అది ఎవరి లోపం.

దానికి మూల స్తంభాలైనప్రజల స్వార్ధానిదా? అందులోంచి పుట్టి, ప్రజల అభిప్రాయమని, పార్టీ గతి-గమ్యాలని గాలివాటంగా మార్చే, రాజకీయనాయకులదా?

యథా ప్రజా - తథా రాజా

ఉదాహరణకి,
గ్రామీణ వెనుకబాటు లో అగ్రస్థానం ఏ జిల్లాదో తెలుసా?
ఒకప్పటి ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని విజయనగరం. ఈ జిల్లా కాంగ్రెసు మంత్రి కుటుంబం నుంచి నలుగురు వ్యక్తులు శాశన సభ్యులు లేదా పార్లమెంటు సభ్యులు. జిల్లా ఎంత వెనుకబడిందో, వీరి ప్రైవేటు ఆస్తులు అంత వృద్ధి చెందాయి. ప్రజలారా కళ్ళు విప్పండి.

ప్రజలు మారితే, పాలకులు మారతారు.
పాలకులు మారితే పాలన మారుతుంది.

దీని కోసమే కదా ఉద్యమాలు. లేని పక్షంలో,
తిరోగమనానికి మరిన్ని కొంగొత్త కారణాలకై నిరంతర అన్వేషణ కొనసాగుతుంది


* ఇది కొంతమందిని బాధించే విషయమైనా, సత్యదూరం కాదు.

20, డిసెంబర్ 2009, ఆదివారం

తెలంగాణా ఉద్యమ నిర్వహణలో లోపాలు

ప్రస్తుతానికి రాజకీయనాయకులని పక్కన పెడదాం. ఈ ఉద్యమం ఫలితం ఏదైనా, అది మూడు ప్రాంతాల తెలుగు వాళ్ళనే కాకుండా దేశాన్ని ప్రభావితం చేసే అంశం. అటువంటిదాన్ని చాలా హ్రస్వ దృష్టితో నిర్వహించారు.

1956 తరువాత, గత ఏభై ఏళ్ళలో ఎంతోమంది కొస్తా-సీమ ప్రాంతవాసులు హైదరాబాదు పరిసరప్రాంతాల్లొ నివాసాలు, జీవనోపాధి కల్పించుకున్నారు. తెలంగాణా అంశం ముందుగా వీరిని, తద్వారా అనేకమంది కోస్తా-సీమ వాసుల్ని ప్రభావితం చేస్తుంది.

అలాగే ఇప్పటి తరం విద్యార్ధులు, ఆం.ప్ర గురించి తమ పాఠ్యాంశాలలో చదువుకున్నారు. వీరందిరికి విడిపోవడాం అనేది జీర్ణించుకులేని విషయం. ఏదో కోల్పోతున్నామే అనే తెలియని బాధ. ఉద్యమ లక్ష్యాలు, స్వరూపాలు వేరైనా, "కాశ్మీరు విడగొట్టండి" అనే ప్రతిపాదన ఎలాంటి భావోద్రేకాల్ని రేకెత్తిస్తిందో, తెలంగాణా విభజన అదేస్థాయి ఉద్రేకాన్ని కలిగిస్తుంది ( కనీసం నా వరకైనా). అలాగే, కోస్తా-సీమ వాసుల్ని దోపిడీ దారులు, దురాక్రమణదారులు అనడం కూడా (దీన్ని కె.సీ.ఆర్ తర్వాత ఖండించినా గానీ)

ఇటువంటి సున్నితమైన అంశం పట్టుకుని, ఎక్కడ అంధ్రా పేరు కనిపిస్తే, దానికి తెలంగాణా పేరు తగిలించడాం, భాగో-జాగో లంటి నినాదాలు, దురాక్రమణ దారులు-దోపిడీ దారులు అనే ఆరోపణలు, సానుభూతి ఉన్నవాళ్ళని కూడా దూరం చేస్తాయి. అలాగే, పోటీగా తెలంగాణా తల్లికి పిల్లలు ప్రాణం పోయడం అనవసరం.

ఇవేవీ కాకుండా, మనం విడిపోయినా తెలుగు తల్లికి రెండు కళ్ళలా మెదలుదాం, లాంటి పాజిటివ్ ఇమేజ్ తీసుకొచ్చుంటే, కొస్తా-సీమల్లో ఇంత నిరసన వచ్చేది కాదు. అంతటితో సరిపెట్టకుండా, చిన్న రాష్ట్రాల వలన పరిపాలనా సౌలభం కూడా వివరించి ఉంటే, వారి నుంచి కూడా మీకు మద్దత్తు ఉండేది.

తెలంగాణా ఏర్పడకపోతే, సివిల్ వార్ (జయశంకర్ ఉవాచ), అణువిస్ఫోటణం (కె.సి.ఆర్ ఉవాచ) జరగడానికి ఎంత సంభావ్యత ఉందో, కోస్తా-సీమ వాసుల అభిప్రాయాలని పరిగణించనప్పుడూ అంతే ఉంటుంది. పర్యవసానాలు అన్ని ప్రాంతాలవాళ్ళూ అనుభవిస్తారు. ఒకరికి లాభం ఒకరికి నష్టం రావు, యుద్ధమే వచ్చినప్పుడు.

నాకు తెలంగాణా ఉద్యమం పై సానుభూతి ఉన్నా సమైక్యంగా ఉండాడాన్నే కోరుకుంటాను. కొస్తా-సీమల్లో వినిపిస్తున్న ఉద్యమ రాగాలని స్పాన్సర్డ్ గీతాలుగా సంభోదించడాన్ని వ్యతిరేకిస్తున్నాను.

ప్రతీ ఒక్కరూ "అంతమంది ప్రజలకీ ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయం తీసుకుంటాం" అంటారేగాని, అదేంటో చూపే ప్రయత్నం చెయ్యరు. తెలంగాణా ఉద్యమకారులు రాజీ పరిష్కారాలు ఆలోచించండి. ఈ పీట ముడి విప్పడానికి సహకరించండి.

నాకు వచ్చిన ఆలోచన ఇక్కడ

(నాకు హైదరాబాదు తో గానీ, తెలంగాణా తో గానీ సంబంధ-బాంధవ్యాలూ లేవు. అసలు ప్రత్యేక కోస్తావే లాభదాయకం!!!)

18, డిసెంబర్ 2009, శుక్రవారం

తెలంగాణా సమస్య - ఒక రాజీ పరిష్కారం

తెలంగాణా విభజనవాదులు: ప్రత్యేక రాష్ట్రం కావాలిసిందే. ఎందుకంటే
1) మా వనరుల మీద అధికారం మాకే కావాలి
2) ఎన్నోసార్లు రాజకీయనాకుల చేతిలో మోసపోయాం. దోపిడీలకు గురయ్యాం. ఇక మావల్ల కాదు
3) చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యపడుతుంది
4) తెలుగు వారమైనా మా సంస్కృతి, సాంప్రదాయం వేరు. ఈ బలవంతపు వివాహం నుంచి మాకు విడాకులు కావాలి.
5) నిధులు, వనరుల పంపిణేల్లో, అన్యాయానికి గురి అవుతున్నాం.
6) సమైఖ్యాంధ్రా కోరుకునే వాళ్ళకి నిజంగా హైదరాబాదే కావాలి. హైదరాబాదు తెలంగాణాలో అంతర్భాగం. ఇది నైజాముల కాలంనుంచే అభివృద్ధి చెందిన నగరం. మీరొచ్చి కొత్తగా ఊడబొడించింది లేదు.

భౌగోళికంగా వేరైనా మానసికంగా కలిసుందాం (లేదా అందుకు ప్రయత్నిద్దాం)

సమైఖ్యాంధ్రా కోరుకునే వారు:
1) అసలు విడిపోవడమన్నదే పరిష్కారం కాదు. కలిసి ఉంటే కలదు సుఖం. చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి సాధ్యం (ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో) కాకపోవచ్చు.
2) రాష్ట్ర విభజన వల్ల అనర్ధాలు ఎన్నో. ఇది రాష్ట్ర సమస్యేకాదు. జాతీయ భత్రతో ముడిపడి ఉన్న సమస్య కూడా. నక్సాలిజం, తీవ్రవాదం, వేర్పాటువాదం వంటివి మరింత ప్రజ్వరిల్లవచ్చు.
3) ఇన్నాళ్ళు మీ ప్రాంత రాజకీయనాకులు వెలగబెట్టిందేంటి? ఇది రాజకీయనాయకులు స్వప్రయోజనాలకోసం, తమ ఉనికి కోసం తిరగదోడిన సమస్య. అయినా రాయలసీమ వెనకబడి లేదా? ఉత్తరాంధ్రా వెనకబడిలేదా. మీ వెనకబాటుదనానికి అంధ్రావాళ్ళని దోపిడీ దారులనడం, నిజంగా గర్హించవలసిన విషయం.
4) ఇక ముఖ్యంగా, హైదరాబాదు లో నివాసం, వ్యాపారాలు వృద్ధి చేసుకున్నవారి పరిస్థితి ఏంటి. వాళ్ళకి భద్రత ఏది. మీరిచ్చే వాగ్దానాలు తుంగలో తొక్కరన్న నమ్మకమేమిటి. ఇన్నాళ్ళూ మేము కూడా, హైదరాబాదు అభివృద్ధిలో పాలుపంచుకున్నాం. మేము పోషించినా హైదరాబాదు మాకు లేకపోవడం అన్యాయం.
5) ఒకవేళ తెలంగాణా వచ్చిన పరిస్థితులలో, ముఖ్యంగా, నీళ్ళ దగ్గర, ఇతర రాష్ట్రాల్లాతోవాళ్ళాలాగే తగవులాడుకోవాలి.

ఇప్పుడు ఎలా వుంది అంటే, కరవమంటే కప్పకి కోపం, విడవ మంటే పాము కోపం లాగ తయరయ్యింది. అసలు కథ ఇంత దూరం వచ్చిన తరువాత, కలిసున్నా విడిపోయినట్టే. ఈ పీటముడి ఇప్పడానికి, నాకు హైదరాబాదు, జలవనరులపై ఆధిపత్యం ప్రధాన అడ్డంకులుగా కనిపిస్తున్నాయి.




కాబట్టి నేను సూచించే పరిష్కారం, రాష్ట్రా విభజన ముఖ చిత్రాన్ని మార్చి, విభజన చేయటం. కాకపోతే, రెండు సమూహాలూ పట్టువిడుపులు ప్రదర్శించాలి. (ప్రక్క పటం చూడాండి. నీలి రంగు గీత కొత్త విభజన రేఖని సూచిస్తుంది)

1) రాయలసీమ, కోస్తాంధ్రలలో, మెహబూబ్నగర్, సగం రంగారెడ్డిని ని కలపాలి. అంటే, తెలంగాణా ఒక జిల్లాని కోల్పోవాలి. అలాగే సగం రంగారెడ్డి కూడా. సీమాంధ్రలు, విభజనకి అంగీకరించాలి.
2) హైదరాబాదు ఉమ్మడి రాజధాని గా చెయ్యాలి
3) రెండు కొత్త రాష్తాల మధ్య కొన్ని ప్రత్యేక అవగాహనలు ఉండాలి (వాహనాలు, జలవనరులు, రవాణా ఇలాంటి విషయాల్లో)
4) క్రిష్ణా పై అధిక హక్కులు సీమాంధ్రకి వస్తాయి. గోదావరిపై నియంత్రణ తెలంగాణాకి లభిస్తుంది.
5) నాగార్జునసాగర్ పై రెండు రాష్ట్రాలకి హక్కులు ఉండాలి.
6) హైదరాబాదు ని ఫ్రీజోన్ గా కాకుండా, ఫ్రోజెన్ జోన్ గా ప్రకటించాలి. ప్రత్యామ్నాయంగా మూడు ప్రాంతాల్లో (తెలంగాణా, రాయలసీమ, కోస్తాల్లో ఒకటి చొప్పున), మూడు ప్రాంతాలని అభివృద్ధి పరచాలి (అభివృద్ధి వికేంద్రీకరణ కోసం)

అలోచించవలసిన విషయం:
తెలంగాణా వాదులు: ఇప్పుడు మీరు మహబూబ్ నగర్, సగం రంగారెడ్డిని కోల్పోతున్నారు. హైదరాబాదు ని పంచుకుంటున్నారు. ఇప్పుడు మీకు అర్ధమవుతోడా, విడిపోవడం, విభజనలో బాధ? మీరు నిజంగా, తెలంగాణా అభివృధి కాంక్షించేవారే అయితే, మహబూబ్ నగర్ సీమాంధ్రలో వున్నా, తెలంగాణాలో ఉన్నా పెద్ద తేడా ఉండదు, ఇప్పుడు రెండూ చిన్నా రాష్ట్రాలే కాబట్టి.

తెలంగాణాలో, గోదావరీ పరివాహక ప్రాంతమే ఎక్కువ కాబట్టి, దానిపై ఎగువ నియంత్రణ మీచేతికిందకే.

సమైఖ్యవాడులు: దీనివలన, హైదరాబాదు పై అనవసర ఆందోళణలు అక్కర్లేదు (ఉమ్మడి రాజధాని కాబట్టి). క్రిష్ణా పై అధిక నియంత్రణ వస్తుంది. ఏదో ఒకటి వొదులుకోక తప్పదు కాదా, విభజన అన్న తరువాత. అసలు కొంతమంది తెలంగాణావాదుల వాదన చూస్తే, వాళ్ళ ఆరోపణలకి మనసు విరిగిపోతుండి. కలిసుండి వేర్వేరుగా ఉండేకన్నా, విడిపోయి కలిసుండడమే ఉత్తమమేమో.


(ఇది ఒక ప్రతిపాదన మాత్రమే. నాకున్న సమాచారంతో ఈ సూచన చేయడం జరిగింది. ఎవరి మనసు నొప్పించినా క్షమించ గలరు. ఈ టపా పై నేను మరి ఇక వ్యాఖ్యానించను.)

19, ఏప్రిల్ 2009, ఆదివారం

మల్లెల మాలలూగక మానునా, మాయునా?

మల్లీశ్వరి సినిమాలో "మనసున మల్లెల మాలలూగెనే" పాట ఏమాత్రం అభిరుచి ఉన్న శ్రోతలకైనా తెలుస్తుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కలం నుంచి జాలువారిన తెలుగు సొగసుల సిరి మల్లెల మాలలు ఆ సినిమాలోని మాటల పాటలు, పాటల ఆటలు.

వారి మేనకోడలు, అవసరాల (వింజమూరి) అనసూయాదేవి గారు ఎన్నో జానపద గీతాలని ఆంధ్రదేశమంతా తెరిగి, వెతికి పట్టి, బాణీలు కట్టి, స్వరబద్ధం చేసినవారుగా చిరపరిచితులు. వారి కృషిని మెచ్చి, ఆంధ్రవిశ్వవిద్యాలయం వారు "కళాప్రపూర్ణ" బిరుదుతో ఆవిడని సముచితంగా సత్కరించారు. వారిని 22 వ టెక్సాస్ తెలుగు సాహితీ సభల సందర్భంగా కలవడం జరిగింది. ఆవిడ మాట్లాడుతూ కొన్ని ఆశక్తికరమైన విషయాలని చెప్పారు. మల్లెశ్వరి లో, "నోమీ నోమన్నలాలొ" పాటకి, అలాగే "మనసున మల్లెల" పాటకి కూడా, బాణీలు ఆవిడే సమకూర్చేరుట (కానీ సినిమాలో రాజేశ్వరరావు గారీ పేరే కనబడుతుంది). అందుకే
కృష్ణశాస్త్రి విరచితమవ్వంగ
వింజమూరి రసస్వర వింజామరలు
విసురుగ విసరంగ, మనసున మల్లెల మాల
లూగక మానునా, మాయునా!
ఆవిడ కుటుంబానికి ఎంతోమంది పేరిన్నిక గల కవుల ( విశ్వనాధ, కొకు, శ్రీశ్రీ, చలం...) తో ఉన్న సన్నిహిత భాంధవ్యాల గురించి, ఆవిడ స్వంతమాటల్లొ ఇక్కడ వినండి (నిడివి 19 ని||)



(ఆ గొంతుక విన్నవారెవ్వరు, ఆవిడకి 89 సంవత్సరాలంటే నమ్మకపోవచ్చు)

15, ఏప్రిల్ 2009, బుధవారం

యథా ప్రజా - తథా రాజా

గత కొన్ని నెలలుగా బ్లాగ్లోకంలో ఫొటోలుపెట్టి మరీ విమర్శలు చేస్తూ, మా జాతిని మొత్తం అవమానపరుసున్నందుకు మనస్తాపం చెంది నేను రాస్తున్న బహిరంగ లేఖ.


(శబ్దరూపంలో)

మాపై వచ్చిన ప్రధాన ఆరోపణలు: నీతి, నిజాయితి, సమదృష్టి, నైతికవిలువలు, పారదర్శకతవంటివి లేకపోవడం. డబ్బు-పరపతి లకోసం ప్రాకులాడ్డం, సహనం కోల్పోయి నోటికొచ్చినట్టు మాట్లాడ్డం. ఇవి ఒక రాజకీయనాయకునికి ఉండాల్సిని కనీస అర్హతలు అని . ఇవన్నీ మాలో మాత్రమే ఉన్నాయా, వీటిలో మీరుపట్టభద్రులుకారా అని నేను మిమ్మల్ని ప్రశ్నించదలచుకొన్నాను. ఇది ఎన్నికల సమయం కాబట్టి మమ్మల్ని ఆడిపోసుకోవడం మరీ ఎక్కువయ్యింది. డబ్బు విచ్చలవిడిగా ప్రవహిస్తుంతోందని. మద్యం ఏరులై పారుతోందని.

ఏమయ్యా, బాబూ, కొంచం సాయం చెయ్యవయ్యా అంటే, "నా కేంటి" అనే మనస్తత్వం నీది. నీవాటా ఇవ్వకుండా రమ్మంటే, మరి నీ పనులన్నీ మానుకొని నువ్వొస్తావా? అయినా మేం చేసే ఖర్చువల్ల ఒనగూరే సామాజిక న్యాయం మీకర్ధమవ్వట్లేదు. అధికారంలో ఉన్నప్పుడు సంపాదిస్తాం. ఎన్నికలప్పుడు ఖర్చుపెడతాం. అవసరమైతే ఖర్చుపెట్టిస్తాం కూడా. మేము దోచిన సొమ్ముని మళ్ళీ మీ దోసిళ్ళాలోనే కదా పోస్తున్నాం. ఇంతకు మించిన ఎకనమిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఈ ప్రపంచంలోనే లేదు.

మీ సాఫ్టువేరు/హార్డువేరు కంపెనీల్లో, వేరేవాడు ఒక పదివేలు ఎక్కువిస్తానంటే చెప్పాపెట్టకుండా ఉద్యాగాలు దూకెస్తారే? మరి పార్టీలు దూకితే మమ్మల్నెందుకంటారు. మాకు మారడానికి మహా అయితే మూడుపార్టీలున్నాయి. మీలాగ పదుల/వందల సంఖ్యలో లేవు. అందునా దూకడం మా జన్మహక్కు. మాక్కూడా పైకెదగడానికి మీతోపాటూ సమనావకాశాలు కావాలి, రావాలి. ఇందుకు మేం చట్టాలు చేసుకొంటాం. ప్రజల కోసం - ప్రజల కొఱకు అన్న నానుడిని మా అంతబాగా నిజంచేస్తున్నవారెవరో మీరు చెప్పండి.

మీరు దేశంకోసం ఏమైనా చేసారా? మీరెవరికైనా ఉద్యాగాలిప్పించారా? అదీ ఏ అర్హతలేని వాడికి. మా వల్ల ఎందుకూ కొరగాని వెధవాయలెందరికో ఉపాధికల్పిస్తున్నాం. కావాల్సిన అర్హత ఒకేఒక్కటి. అది నమ్మకం, అంతే. వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని పెద్దన్నలా పోషిస్తున్నాం. మేమే లేకపోతే, నిరుద్యోగ సమస్య పెనుభూతమై మీ ఉద్యోగాలనీ కబళిస్తుంది. మీకు చేతకాని పనులెన్నో మేము చేస్తున్నాం. చేసి చూపిస్తున్నాం. అయినా మా మీద ఏంటో మీ ఏడుపు.

తిరుపతి లో భగవంతుని దర్శనానికి క్యూలో నిలోచోడానికి కూడా మీకు బద్దకం. VIP దర్శనం దొరికిందని నలుగురిలో గొప్పగా చెప్పుకోవాలని ఆరాటం. అందుకు మా MLAల, MPల, లెటర్లు కావాలి. అప్పుడు గుర్తొచ్చామా మేము? పదిమందిలో మా వాడు మంత్రి, మాచుట్టం కంత్రి అని చెప్పుకోవడానికి కావాలి. మీకు కాంట్రాక్టులు పనులు కావాలంటే మేము చక్రం తిప్పాలి. అప్పుడు మాత్రమే గుర్తొస్తామా మేము? ఇంతా చేసీ, చేడీ, పబ్లిగ్గా తిట్టడానికి ఎవరు అప్పనంగా దొరుకుతార్రా అంటే, మేమే. ఇంకెవరు. ఇంకెవిరినైనా అంటే పడతారా వాళ్ళు. మీ బొమికలేరరు.


కులాలు మతాల గొడవలు: ఎందుకలా కొట్టుకు చస్తారు. మాదంతా ఒకే కులం: రాజకీయం. మాది ఒకే మతం: స్వలాభం. మాకు లేని కులాలు, మతాల గొడవలు మీకెందుకు. ఈ పార్టీ, ఆ పార్టీ అనే బేధభావనలు మాకులేవు. అంటరానితనం అసలే లేదు. మేమంతా ఎంతో ఐకమత్యంగా ఉంటాం. కొట్టుకున్నట్టు మీ కళ్ళకి కనిపిస్తాం. ఎందుకంటే, మీరు గ్రుడ్డివాళ్ళు కాబట్టి.

మీరు ఉద్యాగోలు కోసం ఎగబడుతూ, లేని విద్యార్హతలు సృష్టించుకోలేదా? లేని అనుభవాన్ని ఉన్నది గా చెప్పుకొని ఉద్యాగాలు సంపాదించలేదా? CVలు, రెస్యూమెలు కూడా కాపీ కొట్టలేదా? మేమూ అలాగే చెప్తాం, చేస్తాం. సంఘసేవ చేసామని, చేస్తామని. ప్రజల కష్టాలు తెర్చడమే మా పరమావధి అని. మీరే అబద్ధాల పుట్టలైనప్పుడు, మీకెందుకు నిజాలు చెప్పాలి? మీరుచేస్తే ఒప్పు. మేము చేస్తే తప్పునా? ఇదక్కిడి న్యాయం? ఎందుకీ ద్వందప్రవృత్తి?

పెళ్ళో, చావో వచ్చినప్పుడు కరెంటు స్తంభానికి తీగలు తగిలించి విద్యుత్తు చౌర్యం చెయ్యడం లేదా? పొలాల్లొ, అక్రమంగా మీటర్లు టాంపరింగి చెయ్యట్లేదా? సాగుకాలువలని దారి మళ్ళించి, మీ కమతానికి నీరందితే చాలు, కిందవాడేమైపోయినా పర్వాలేదు అనుకోవట్లేదా? బందులు, హర్తాళ్ళు అంటూ, బస్సులు, ఆసుపత్రులు, కార్యాలయాలు తగలపెట్టి ప్రభుత్వఖజానా కొల్లగొట్టట్లేదా? ఇంత బహిరంగా దోపిడీ చేసే మీరు మా ఆదాయవవరులని ప్రశ్నించే హక్కు ఎప్పుడో కోల్పోయారు!

మేనిఫెస్టోలో చెప్తాం. ఎన్నో చెప్తాం. అది చేస్తాం ఇది చేస్తాం అని. అంటే అన్నె చేసెయ్యాలా? చెయ్యగలమా? చెయ్యనిస్తారా? మీరు పైదేశాలకి చదువలకని చెప్పి, "నేను చిన్నప్పట్నుంచి ఐనిస్టీను లాగ ఆలోచించే వాడిని. నా వల్ల మీ యూనివర్శికే కళ పెరుగుతుంది" లాంటి కల్లబొల్లి కబుర్లు చెప్పరా? ప్రగల్భాలు పోరా? వాగ్ధానభంగంచేసినందుకు మీ డిగ్రీలన్నీ బర్ముడ ట్రయాంగిల్ లో విసిరిపారెయ్యాలి అసలు. అదిసరే, పోనీ మనదేశంలో డిగ్ర్రీలు అంటే, మార్కెటులో పట్టాలు కొనుక్కోవట్లేదా? ర్యాంకులు కొనుక్కోవట్లేదా? చదువులు కొనుక్కోవట్లేదా? మీ దురాశకి అంతనేది ఉందా. ఇలా వేలమంది దోచుకుంటున్న ధనరాశి ముందు, మా సంపాదన ఎంత. మీరు వేసే ముష్టి తో సమానం. పక్కవాడ్ని నొక్కి, తొక్కిపైకెళ్ళడం. ఇది అందరి ప్రాధమిక హక్కు. కాదనే అధికారం మీకు లేదు.


మా ఆస్తుల చిట్టా విప్పి, అయ్యో నీకు కారు కూడా లేదని వాపోతారు, పాపం జాలి చూపిస్తారు, కాదు కాదు మా బీదరికపుపాట్లని చూసి గేలీ చేస్తారు. ఎగతాళి చేస్తారు. మరి మీ సంగతేంటి? ఇన్-కం టాక్సు ఎగ్గొడ్డానికి నానా అవస్థలూ పడతారు. నానా సంకలూ నాకుతారు. కానీ కుళాయి కావాలి. కరెంటు కావాలి. గిరెంటు కావాలి. ప్రభుత్వం నుంచి సకల సౌకర్యాలు కావాలి. మనం మాత్రం జేబులోంచి పైసా తియ్యం. ఇన్-కం టాక్సు వాడికి పది రూపాయలని చూపించిన ఆదాయం, అదే వీసా అప్లై చెయ్యాడానికి వెయ్యురూపాయలయ్యి కూర్చుంటుంది. మా ఆస్తి కూడా అంతే గురువుగారు. సందర్భం బట్టి దాని విలువ పెరుగుతుంది లేదా తరుగుతుంది. తగ్గకపోతే తగ్గిస్తాం. ఏం మీరుచెయ్యగా లేనిది, మేము చెయ్యకూడదా?

ఇంక ఏదో మా భాష గురించి, మా నైతికవిలువలు గురించి, మా సభ్యత-సంస్కారాల గురించి. పాపం మీరు పెదవులు విరిచి విరిచి, అవి రెండు చెక్కలు, మీ మండే గుండె మూడు ముక్కలు అయ్యాయి కాబోలు. మీరు చదువుకున్నా వారు ట. సంస్కారవంతులు ట. మరి మీ భాష అలా అఘోరించిందేం. ఎందుకలా ప్రాముఖ్యతకోసం పాకులాడతారు. ఎందుకలా వీధి కుక్కల్లా కొట్టుకుంటారు. ఎందుకలా కాకుల్లా చెవులు చిల్లులు పడేలా తిట్టుకుంటారు. ఎవరు ఎవరికీ తెలియనప్పట్టికి "అటుతంతాం, ఇటు తంతాం" అంటూ అపర ఘటోత్కచుడిలా చిందులు తొక్కుతారు. వందమందికూడా లేని మీలోనే నమ్మకంలేదు. మర్యాద లేదు. మన్ననలేదు. పెద్దరికంలేదు. కట్టుబడిలేదు. మరి వేలమంది మూర్ఖులు, అదే అభిమానులున్న మాకెలా సాధ్యం అనుకుంటున్నారు.

మేమెక్కడినుంచో ఊడిపడలేదు మహాప్రభో. మేము గ్రహాంతరవాసులం అంతకన్నా కాదు. మేంకూడా మీలో ఒకరమే. విమర్శలు చేసేముందు ఆ విషయం మరచిపోకండి.

మార్పురావాలి అంటే, అది మీలోంచే మొదలవ్వాలి. మా నుంచికాదు.
యథా ప్రజా - తథా రాజా

ఇట్లు
- ఒక రాజకీయ నాయకుడు

10, ఏప్రిల్ 2009, శుక్రవారం

test


\int_{0}^{1}\frac{x^{4}\left(1-x\right)^{4}}{1+x^{2}}dx
=\frac{22}{7}-\pi

పద్యం - వృత్తాలు - అంకెలు

సాంప్రదాయకంగా మనం పద్యాల ఛందస్సుని నేర్చుకున్నప్పుడు
" ఈ పద్యానికి ఈ గణాలు ఫలానా వరుసక్రమంలో రావాలి"
అని నేర్చుకుంటాం. ఉదాహరణకి, ఉత్పలమాల తీసుకుందాం.
"భ ర న భ భ ర వ"
UII - UIU - III - UII - UII - UIU - IU
అనే గణాలు వరుస క్రమంలో ప్రతిపాదంలోనీ రావాలి.
అనగా లఘువులు, గురువులు (మొత్తం కలిపి 20) ఈ క్రమంలో రావాలి. అదే లఘువుని "౦" గానూ, గురువుని "1" గానీ గుర్తించామనుకోండి: అప్పుడు వచ్చే సంఖ్య
UII - UIU - III  - UII - UII -  UIU - IU
100 - 101 - 000 - 100 - 100 - 101 - 01

ఆ సంఖ్యని దశాంసమానంలో రాస్తే 607381

ఒకవేళ ఎక్కడైనా ఒక గణం తప్పయ్యిందనుకోండి, ఉదాహరణకి, చివరి "IU" కి బదులుగా "II" అనే గణాలు మీపద్యంలో పడ్డాయనుకోండి, అప్పుడు, మీ పద్యంలోని పాదం యొక్క సంఖ్య
UII  UIU III   UII UII   UIU II
100 101 000 100 100 101 00
607381 - 1 = 607380

గణం చివరిదయ్యింది కాబట్టి, సులువుగా పట్టేసాం. మరి ఎన్నే చోట్ల తప్పుంటే? ఏ స్థానంలో తప్పుందో కనుక్కోవడం ఎలా?

అది ఆలోచించే ముందు, exclusive-or లేదా xor అనే బూలియన్ సూత్రం చూద్దాం. దాని ప్రకారం:
0 + 0 = 0
0 + 1 = 1
1 + 0 = 1
1 + 1 = 0

దీన్ని ఉపయోగిస్తే మనం తప్పు ఎక్కడుందో ఇట్టే పట్టేయొచ్చు. ఇందాక ఉదాహరణని తీసుకుంటే:
100 101 000 100 100 101 01
+
100 101 000 100 100 101 00
=
000 000 000 000 000 000 01

కాబట్టి, ఎక్కడైతే, మనకి ఒకటి కనిపిస్తుందో, ఆ స్థానాలన్నిటిలోనూ గణం తప్పిందని తెలుస్తుంది. పై ఉదాహరణలో 20 వస్థానంలో తప్పిందని ఇట్టే తెలుస్తుంది కదూ?

ఇప్పుడు అన్ని (నాకుతెలిసినవి ) వృత్తాలని చూద్దాం:

ఉత్పలమాల:
"భ ర న భ భ ర వ
UII - UIU  - III  - UII  - UII - UIU -  IU
100 - 101 - 000 - 100 - 100 - 101 - 01 = 607381

చంపకమాల:
న  జ  భ  జ  జ  జ  ర
III - IUI - UII - IUI - IUI - IUI - UIU
౦00 - 010 - 100 - 010 - 010 - 010 - 101 = 83093
మత్తేభం:
స భ ర న మ య వ
IUU - UII - UIU - III - UUU - IUU - IU
IIU - UII - UIU - III - UUU - IUU - IU
001 - 100 - 101 - 000 - 111 - 011 - 01 = 207085
శార్ధూలం:
మ స జ స త త గ
U U U - I I U - I U I - I I U - U U I - U U I - U
111 - 001 - 010 - 001 - 110 - 110 - 1 = 469229
వచ్చే టపాలో జాతులు పైన శోధిద్దాం. అంతవరకు శెలవు.
(భైరవభట్ల గారు తప్పు సరిదిద్దినందుకు కృతజ్ఞతలు)

7, ఏప్రిల్ 2009, మంగళవారం

BIG EVENT - చిరు సాయం

పన్నెండు వేల మంది సైనికులు
చేతిలో చీల్చిచెండాడే మరతుపాకులు
రణగొణధ్వనులు చేస్తూ చ్చక్కర్లు కొడుతున్న యుద్ధట్యాంకులు
సైనికాధ్యక్షుడు "ఆగే బఢో" అంటూ ఆవేశంతో ఆజ్ఞాపిస్తూ, సైనిక పట్టాలన్ని యుద్ధానికి సన్నద్ధులని చేస్తుంటే?
ఓహ్ ... ఊహించికుంటుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది కదూ!


మరి ఆ సైనికులు బదులుగా విధ్యార్ధులుంటే
మరతుపాకులకి బదులుగా పలుగులు-పారలు, కుంచెలు, నిచ్చెనలుంటే
సర్వసైన్యాధ్యక్షుడు, తమలో ఒకడై, పదండి ముందుకు, కర్మభూమి ఋణం తీర్చుటకు, అంటూ సేవాతత్పరతని జాగృతపరుస్తుంటే? ఒళ్ళు పులకరిస్తుంది కదూ!


దాని పేరే BIG EVENT.
1982 న TAMU లో ప్రారంభమైన BIG-EVENT, అమెరికా సంయిక్తరాష్ట్రాల్లో విధ్యార్ధులచేత నడపబడే అతిపెద్ద సేవాకార్యక్రమం. దీని ముఖ్యోద్దేశ్యం, స్థానిక ప్రజలకి విద్యార్ధులు వివిధ స్వచ్చంద సేవాకార్యక్రమాల ద్వారా కృతజ్ఞతలు తెలుపడం. ప్రస్తుతం ఇది, మరొక 50 కి పైగా ఇతరకళాసాలలకి వ్యాపించింది.

ఈ సంవత్సరం Child Rights & You (CRY) సంస్థ తరపున ఒక పదిమందికి పైగా భారతీయులం BIG-EVENT లో పాలుపంచుకిన్నాం. అధ్యక్షుడు జార్జ్ బుష్ Sr , గడ్డకట్టే చలిని లెక్క చెయ్యకుండా వచ్చిన పన్నెండువేల పైచిలుకు విద్యార్ధులనుద్దేసించి ప్రసంగించడంతో కార్యక్రమం ప్రారంభమయ్యింది. ప్రసంగాలూ అవి ముగియగానే, చీమలదండులా బయలుదేరి అందరం పని-ముట్లు సేకరించుకొని, రెండు జట్లుగా విడిపోయి, మాకు అప్పచెప్పబడిన ఇళ్ళకి కి చేరుకున్నాం. ఒక నల్లజాతి వ్యక్తి ఇంట్లో అడుగుపెట్టం నాకు అదే మొదటిసారి. ఆర్ధికతారతమ్యాలని ప్రత్యక్షంగా చూడ్డంకూడా అదే మొదటిసారి.

మాకు అప్పజెప్పిన పనులు పట్టిక చూసుకొని, చెయ్యాల్సిన పనులని విభజించుకున్నాం. ఇద్దరు ఇంటి ముందు పచ్చికని శుభ్రం చేస్తూంటే, మరో ఇద్దరు ఇంటికి బయట వెల్ల వేయడం మొదలు పెట్టారు. మిగిలిన ఇద్దరం వంటగది, పరిసరాలు శుభ్రంచేసాం. తరువాత, బీరువాలు, కిటికీలు, అరుగులకి వెల్ల వేసాం. ఇదంతా అయ్యేసరికి ఒక ఐదు గంటలు పట్టిండి. మిగతా వాళ్ళు కూడా తమ తమ పనులు పూర్తిచేసేసారు ఈ లోగా. పనిలో పనిగా పైంట్ డబ్బాలు ఒలకబొయ్యడం లాంటి అప్పజెప్పని పనులు కూడా చేసాం. పూలకుండీలు చేతిలోంచి జారిపోతే, క్షమాపణలతో పాటు, పరిహారంగా ఒక పదిహేను డాలర్లు సమర్పించుకోవడంతో, మా కార్యక్రమం పూర్తయ్యింది. పనిముట్లన్నీ తిరిగి ఇవ్వడంతో, మా వరకు BIG-EVENT అయిపోయింది. పాలుపంచుకున్నందుకు సంతృప్తి మిగిలింది. ఇలాంటి కార్యక్రమాలు మన కళాశాలల్లో కూడా జాతీయ స్థాయిలో చేస్తే బావుంటుందనిపించింది.

అసలు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే:

మేనేజిమెంట్, ఎడ్వర్టయిజింగ్, ట్రాన్స్పొర్టేషను, ఐ-టి, హాస్పిటలిటి, లాజిస్టిక్సు, ఇలా ఎన్నో బిభాగాల కో-ఆర్డినాషన్ కావాలి. ఇవి ఆయా సబ్జెక్టులు చదువుతున్న విద్యార్ధులకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ని పెంపొందించడానికి ఎంతో తోడ్పడతాయి. కలగూరగంప లో తాడేపల్లిగారు చెప్పినట్లు, అవకాశాలని మనం సృష్టించుకోవాలి. ఈ ఒక్క ఈవెంట్ ద్వారా, విద్యార్ధులు క్లాసురూములో నేర్చులోలేని ఎన్నో పాఠాలు నేర్చుకుంటారు. పాశ్చాత్యదేశాల్లో అమలవుతున్న "మంచిని" కూడా మనం సంగ్రహించాలి. నేషన్ బిల్డింగ్ కి పునాదులు విశ్వవిద్యాలయాల్లొనే అని నా నమ్మకం. అవి రాజకీయాలైనా, వృత్తివిద్యలైనా, మరేదైనా. ముఖ్యాంగా మన తెలుగుసినిమాల్లో కాలేజీలు అంటే, సొల్లు-కబుర్లు చెప్పడం, అధ్యాపకులతో కుళ్ళు జోకులు వెయ్యడం, అమ్మాయల్ని ఏడిపంచడనికి తప్పా మరెందుకూ ప్పనికిరాని రోడ్దుపక్క బడ్డీకొట్లులాగ చూపిస్తున్న పరిస్థితులు మారాలని ఆశిద్దాం.

-శెలవు

1, ఏప్రిల్ 2009, బుధవారం

తెలుగు పద్యానికి compiler?

భైరవభట్ల గారు, పద్యం.నెట్ మీద టపా రాసినప్పుడు,
పద్యం.నెట్లో, (నాలాంటి) ఔత్సాహికులు పద్యాలు రాయప్రయత్నిస్తే, వ్యాకరణ పరంగా అవి సరియైనవా, లేక, వాటిలో తప్పులు ఏమైనా ఉన్నాయో గుర్తించి, సవరణలకి సూచనలు చేసే సౌలభ్యం ఉంటేబావుంటుంది
అని వ్యాఖ్యరాద్దామనుకుంటూనే, మళ్ళే, ప్రతీ పద్యాన్ని పరీక్ష చెయ్యడం, ఎంత ఖాళీ సమయమున్నా కుదరకపోవచ్చని ఆగిపోయాను. మరి పరిష్కారమేంటి అని అలోచిస్తుండాగా ఇలాతోచింది. ఇది ఎంతవరకు సాధ్యమో (అసాధ్యంకాదు అని నా నమ్మకం) తెలుగు సాఫ్టువేరు జనులు చూడండి:

తెలుగు పద్యానికి వ్యాకరణం ఉన్నాది. గణ విభజన, యతి-ప్రాస, మినహాయింపులు ఇత్యాదులు. ఇవన్నీ చూస్తే, తెలుగు పద్యానికి ఒక compiler ( lexicon analyzer + syntax analyzer మాత్రమే) తయారుచేయడం (మరీ)అంత కష్టంకాదనిపిస్తుంది,

ఉదాహరణకి (laTeX ని అనుకరిస్తూ):
\begin{ATaveladi}
uppugappurambu nrokkapolikanunDu \\
chooDachooDa ruchula jaaDa vaeraya \\
purushulandu puNya purushulu vaeraya \\
viSwadaabhiraama vinura vaema \\

\end{ATaveladi}

పై పద్యాన్ని, compile చేసిన తరువాత, ఆటవెలది లో ఉండాల్సిన గాణాలు లేవనో, ఒక వేళ యతి తప్పితే, ఏ పాదంలో తప్పిందో చెప్తూ, యతి-ప్రాస కుదిరే అక్షరాల్ని సూచించడం లాంటి పనులు సాఫ్టువేరు ద్వారా చేస్తే?


వీటిలో అనుభం ఉన్నవారు, మీ అభిప్రాయాలని తెలియజేయండి. కష్టసాధ్యం కాదు అనుకుంటే, ప్రయత్నించవచ్చు కూడా! ఒకవేళ ఇలాంటి పరికరాలుంటే, నాకు సూచించగలరు.

21, మార్చి 2009, శనివారం

రేయి మించెనోయీ రాజా (పేరడీ video)

రేయి మించెనోయీ రాజా,
హాయిగ నిదురించరా, ఆ .....హాయిగ నిదురించరా

వెన్నెల్లు విరెసె, వెతలెల్ల వెలిసె
ఆశల తారలు మిలమిల మెరిసె

తలపుల్లో నీవు, జలకమ్ములాడి
విందారగింపా విచ్చేయవోయి
మమతల్లు కలుపు, మాయల్లు విరుపు
దూరాలు తరగు, మురిపాలు పెరుగు
హాయిగ నీవింక సేవించవోయీ

రేయి ||

సిరులూ, విరులూ, మనకేలనోయి,
రాగం, అనురాగం మనవేకదోయి

కన్నుల్లు మూసి, మనసే తెరచి
కలలేకంటూ విహరించవోయీ
హార్ధికమాంద్యం కలలకుకాదు
కలలకు కొఱతంటు రానేరాదు
హాయిగ నీవింక శయనించవోయి

రేయి మించెనోయీ రాజా,
హాయిగ నిదురించరా, ఆ .....హాయిగ నిదురించరా
ఉమ్.....ఊమ్..... ఊ....ఊ.......


ఈపాట వీడియో రూపంలో ఇక్కడ చూడండి



రచన: దీపిక ఆచళ్ళ, సోమశేఖర్ ధవళ
గాత్రం: దీపిక ఆచళ్ళ
స్వరకల్పన: ఘంటసాల
మాతృక రచన: సముద్రాల
చిత్రం: శభాష్ రాముడు


నేపధ్యం:
నేను, దీపిక (మా ఆవిడ) కలిసి సాయంత్రం "నడక" కని బయలుదేరాం (ఇలా వాకింగ్ కి వెళ్ళడం, జీవితంలో నాకు ఇదే మొదటిసారి). కాస్త దూరం నడిచిన తరువాత, ఏదైనా పాటపాడొచ్చు కదా అని దీపికని ఆడిగాను. సరే అయితే, మీకిష్టమైన "శభాష్ రాముడు" లోని "రేయి మించెనోయి రాజా" పాడతాను అని మొదలుపెట్టాకా, ఇంక ఆపాటకి పారడి మొదలుపెట్టాను (నాకు అంత్యాక్షరీల్లో, ఇలా పాటలని ఖూనీ చెయ్యడం బాగా అలవాటూ). అది ఇలా మొదలయ్యింది

"అలసి సొలసి, ఆయాసం వచ్చి,
త్వరగా ఇంటికి పోదామురండి" అని మాఆవిడ అంటే


"పోపే పోచి, చారే కాచి
వేడిగా ముద్దే తిందాము రండి" అని నేను,

ఇలా కామెడీగా మొదలయ్యి, పైన రాసిన విధంగా రూపాంతరం చెందింది.

20, మార్చి 2009, శుక్రవారం

మా బాబె, అచ్చం "రాజా" లాగె

మా బాబె, అచ్చం "రాజా" లాగే అన్న సాక్షి
ప్రభుభక్తి పొరలు కమ్మిన కళ్ళు చిదిమి చూస్తే



మా అసహాయత, అశక్తత, అనాశక్తతలే
మీ ఓట్ల, నోట్ల కోటలకి
తిరుగులేని, ఎదురులేని, ఎదురేలేని పెట్టుబడులని

అందుకు మా ఎదుగులేని, బొదుగులేని
బడుగు బ్రతుకులె
సాక్షులని
తెలియకపోదు

19, మార్చి 2009, గురువారం

4, మార్చి 2009, బుధవారం

3, మార్చి 2009, మంగళవారం

ఆలోచనల కాలుష్యం

మనసు కలుషితమైతే సరైన నిర్ణయాలు తీసుకోలేదు. మరి పరిష్కారం: విచక్షణ, క్షమ, ఓర్పు, సహానుభూతి అనే వడపోత కాగితాలతో వడకట్టండి. ఈ భావాన్ని ప్రతిబింబింస్తూ స్ఫురింపజేస్తూ, తయారు చేసిన ఒక 50s ల లఘువీడియో క్రింద చూడండి:

ఒక మూడు సంవత్సరాల క్రితం, విధ్యార్ధిసంఘం ఎన్నికల సందర్భంలో, war of the videos లో భాగంగా, ఒక 10 పది నిముషాలు చిత్రీకరణకి, ఒక 10 నిముషాలు కూర్పుకి "కష్టపడి" చేసిన వీడియో ఇది :) మళ్ళీ లోక్ సభ, శాశన సభ ఎన్నికలు సమీపుస్తున్నతరుణంలో ఇలా!

28, ఫిబ్రవరి 2009, శనివారం

మన గురివిందగింజ నలుపే సుమా!

స్లమ్ డాగ్ మిలియనీర్ (SM). దీని మీద జరుగుతున్న చర్చ ఇంతా అంతా కాదు. మచ్చుకి కొన్ని

కౌముదిలో గొల్లపూడిగారు
దానిపై వారి వివరణ
*** వాళ్ళకి లేవా మనోభావాలు (నవతరంగం)
*** రావు గారి వువాచ (e-కలం)
విజయేంద్రవర్మ -SM (జీడిపప్పు)
ఎందుకు అన్నిఅవార్డులు (జీడిపప్పు)
మురికివాడల *** (గుంపులోగోవిందం)
మురికివాడల *** (అబ్రకదబ్ర)
*** మీ గురివిందగింజ తెలుపా **? (అంతర్యానం)
సైమన్ బఫాయ్ (స్వంత మాటల్లొ)

వాటిలో వచ్చిన కామెంట్లుతో కలిపిచూస్తే ... ఈ సినిమా మీద విమర్శలకన్నా, దీన్ని విమర్శించినవాళ్ళ మీద విమర్శలే తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా మనతెలుగువారైన "గొల్లపూడి" గారి మీద.

ముందు సినిమా గురించి నా అభిప్రాయం (నవతరంగంలొ చెప్పిన విషయాన్ని ఇక్కడ కొంచం విశదీకరించి రాస్తున్నాను). సినిమాని సమీక్షించే ముందు, దాన్ని మూడు భాగాలుగా చేద్దాం.
1) taking/making (కధనం, సాంకేతిక విలువలు, ప్రయత్నం, పడ్డ కష్టాలు వగైరా)
2) presentation (ప్రచారం, సమర్పించిన విధానం)
౩) content (కథ)

taking/making విషయానికి వస్తే, నాకు చాలా నచ్చిన సినిమా. ఉదాహరణకి, సినిమా మొదట్లో మురికివాడల్లోని chasing scene. వెనకాల డప్పులు మ్రోగుతుంటే, కదనరంగంలో సైనికులవీరంగం మల్లే ఉంది. సైమన్ బఫాయ్ వ్యాసం చదివితే దీని నేపధ్యం అర్ధమవుతుంది. సినిమా ఆద్యంతం పట్టుసడలకుండా intense గా సాగుతుంది. మురికివాడల, ధనికవర్గాలవారి జీవినవిధానంలోని వ్యత్యాసము చూపడంలో దర్శక-సాంకేతికనిపుణులు కృతకుత్యులయ్యారు. నేపధ్యసంగీతం, చాయాగ్రహణం మొదలైనవి సినిమా విజయవంతమవ్వడనికి దోహదపడ్డయి. Curious case of Benjamin Button తో పోలిస్తే, దీనిక Oscars రావడంలో వింతేమీ లేదు. అందుకు, దర్శక-నిర్మాతలకీ, సాంకేతికవర్గానికి అభినందనలు.

సినిమా Title ని ఎన్నుకోవడంలోనే నిర్మాతల (లేదా/మరియు దానికి భాద్యులైన వారి) వ్యాపారాత్మక ప్రతిభ కనబడుతుంది. భారతదేశం, పేదరికం, ప్రేమ, ఆశ, మొక్కవోని ఆత్మవిశ్వాసం, డబ్బు. వీటిని Q&A అనే రుబ్బురోలు లోవేసి రుబ్బండి, అలా వచ్చిన కాకా హోటలు పచ్చడిని, ఎదురుకుండాఉన్న అయిదునక్షత్రాల హోటలులో ఆరగించండి. బ్రేవ్ మని త్రేన్చుతూ, పొట్టనిమురుకొనేట్లుగా చెయ్యడంలో వారి ప్రతిభ మరోసారి కనబడుతుంది. దీన్నుంచి మనవాళ్ళు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.

ఇక చివరిగా, కథగురించి. ఎంతోమంది అనుకొంటున్నట్టుగా ఇదొక ఆశావహుడైన ఒక మురికివాడజీవి ప్రయాణంలా నాకస్సలు అనిపించలేదు. చిన్నతనంలో, జమాల్, అతను స్నేహితులు, ఆశావాదులుగా కాదు, అవకాశవాదులుగా కనబడ్డారు. దీనికి నా చిన్నప్పుడు జరిన ఒకసంఘటన చెప్తాను. నాకప్పుడు ఒక 5-6 ఏళ్ళు ఉంటాయి. కాబోలు . మా ఇంటికి ఒక రెండువీధులవెనక కొంచం మురుకివాడల్ని పోలిన గడపలు ఉండేవి. రధాయాత్రరోజులు అనుకుంటా, ఒక గాలిపటం పావలాపెట్టి కొనుక్కుని, ఇంటిముందు వీధిలో, దానికిదారంకట్టి ఎగరెయ్యడానికి నానా అవస్థపడుతుంటే, నాఅంతవయసే ఉన్న మరో కుఱ్ఱాడు, నువ్వు దారం పట్టుకో, నేను గాలిపటంపట్టుకొని, పరిగెడతాను అప్పుడు ఎగురుతుంది అనిసంజ్ఞలతోనే చెప్పి, కాసేపు పరిగెట్టి, దారంతెంచి, గాలిపటంపట్టుకొని పారిపోయి ఆ మురికివాడాలో తేలాడు. కాసేపు నేను చేష్టలుడిగి అలా ఉండిపోయాను. ఆ కుఱ్ఱాడి ప్రతిరూపమే నాకు ఈ జమాల్ & కో లో కనిపించింది. ఎలాగైనా సాధించాలి అనే పట్టుదల మంచిదే! ఒక పావలా సంపాదించి గాలిపటంకొనుక్కొని ఎగరెయ్యడం, అభినందనీయం. గాలిపటంలాక్కుని పొందటం అభిశంసనీయం. SM లో నాకు గోచరించినది రెండోదే!

ఒక్కసారి chasing scene ని జ్ఞప్తికి తెచ్చుకుంటే: సముద్రంలోని అలలు మైలు దూరంనుంచి మొదలయ్యి, తమతో భూమండలాన్ని మింగడనికా అన్నట్లు, ఒకదాని వెంట ఒకటి తరుముకుంటూ వస్తాయి. కానీ కబళించడం తమవల్ల సాధ్యంకాదూ అని తెలిసికాబోలు, ఒడ్డుని ధబ్బుమనిఢీకొని మరొకసారి నీ పనిపడాతానని ఉస్సూరుమంటూ వెనుదిరుగుతాయి. ఆ పోలీసు పర్సిస్థితీ అంతే! ఒక అయిదు నిముషాలు chase చేసినా ప్రయోజనం ఉండదని తెలుసు. కానీ chase చేస్తాడు. chasing scene అధ్బుతంగా తెరెకెక్కించారు. action సరే! మరి దానికి ముగింపేదీ. ఇక్కడే నాకు దర్శకుడి intention మీద అపనమ్మకం కలిగింది. అవకాశవాదం/మురికివాడాల మలినాన్ని destiny,/hope అనే wrapper లో చుట్టిఇచ్చినట్టుగా ఉంది. ఇంక జమాల్ ప్రేమ వయహారమా! బాలీవుడ్ సినిమాలు చూసి, చూసి, రవ్వంతకూడా ఆశ్వాదించలేదు.

అందుకే నా దృష్టిలో ఇది
మామూలు సినిమాల్లో గొప్పసినిమా గొప్పసినిమాల్లో మామూలు సినిమా
ఇక విమర్శలగురించి: చాలావరకు వస్తున్న విమర్శలు కధగురించి, దాన్ని చూపించిన విధానం గురించి. అసలు పేదరికాన్ని చూపించాలా వద్దా, చూపిస్తే ఎలే చూపించాలి. పెంట కుప్పలో ములగాలా? అఖ్ఖర్లేదా? ఇత్యాదులు. సినిమా మాధ్యమంలోని చిత్రమేమిటంటే, చూసిన/చూడని ప్రతీఒక్కడు, ఇలా తియ్యాలి, ఇలాగే తియ్యాలి అనుక్కోవడం (తీసిన అనుభవం ఉన్నా లేకున్నా, సాదకబాధకాలు తెలిసినా తెలియకున్నా), అదే సరియనది అని నమ్మడం. దీనికి ఎవరూ అతీతులు కాదు. ఒకే సన్నివేసాన్ని చూసి, సంధర్బం బట్టి, ఒకే వ్యక్తి పలు రకాలుగా స్పందిస్తాడు. మరి పలు వ్యక్తులు రకాలుగా స్పందించడంలో ఆశ్చర్యమేముంది. విమర్శకులందరూ విచిత్రంగా దీన్ని విస్మరిస్తారు. ఇదేమి లెఖ్కలు కాదు కదా 1+1 = 2 అని ఋజువుచెయ్యాడానికి. ఇక్కడే సినిమాని విమర్శించిన వాళ్ళు, సమర్ధించిన వాళ్ళు విభేదిస్తున్నారు అని నా అభిప్రాయం.

ఇకగొల్లపూడి విమర్శ, దానిపై విమర్శల విషయానికివస్తే:

నాకు ఆయన విశ్లేషణ చాలా సమంజసంగా కనిపంచింది. మొదట ఆయన "నాకు కళ అంటే ఫలానా, ఫలానా. నేను ఇలా నిర్వచిస్తాను. ఏ విధంగా ఉండాలి, ఉండకూడదు" అని ఒక సిద్ధాంతమేదో ప్రతిపాదించేరు. కొన్ని ఉదాహరణలు ఇచ్చేరు. దానికి లోబడి, SM లేదు. కాబట్టి నాకు నచ్చలేదు. అందుకే నేను చూడను అన్నారు. ఇందులో తప్పేంటి?

నేను దశాంశమానంలోంచి చూశాను 1+1 =0 కాబట్టి తప్పు అని రావు గారు అంటే, అయ్యా మీకు బుర్ర లేదండీ, మీ మూర్ఖత్వంకాకపోతేనూ, నేను పెట్టుకున్న radix-2 కళ్ళజోడు పెట్టుకొని చూడండి, 1+1=0 సరియేను అంటే? ఇక్కడా ఎవరి కళ్ళాజోళ్ళు వాళ్ళవి! ఒకళి జోళ్ళు ఒకరికి నప్పవు మరి.

ఒకరు, "అసలు మీరు కళకి ఎలా నిర్వచనం ఇస్తారు. ఏ సూత్రం లేకపోవడమే అసలైన సూత్రం," అంటారు. వినడానికి ఇది చాలా బావుంది. కొంతమేర నిజమే కూడా. నా దృష్టిలో అర్ధవంతమైన వాదన. కాని, కాంతికన్నా వేగంగా ప్రయాణించి, నక్షత్రాలకావల పాలపుంతలవింతలు చూసిరావడం ఎంత ఆచరణ యోగ్యమో, ఏ సూత్రమూ లేకుండా సినిమా నిర్మించడమూ, అంతే ఆచరణయోగ్యం. ఎంత కళాకారుడైన, సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని వ్యాపారాత్మక ప్రపంచంలో అనుభవించలేడు.

వీటన్నికి మించి, అసలు ఆయన సినిమానే చూడలేదు. ఆయనకి విమర్శించే హక్కు ఎక్కడిది అని కొందరు. నేను చూసిన జనాలలో, ఎక్కువమంది, ఇదే విషయం పదే పదే ప్రస్తావించారు. అందుకు వాడిన కొన్ని పదాలు:

చెప్పుడు మాటలు విని, ఎవరో చెప్తే, విని, మూర్ఖత్వం, మట్టి మషాణం, మొదలైనవి
అలా ఆడిగిన వాళ్ళందరు గమనించాల్సింది, అక్కడ చెప్పింది కొడుకు, విన్నది తండ్రి. కొడుకు, "నాన్నా సినిమా బావులేదు, ఇదిగో ఇలా చూపించారు, ఇలా ఉంది" అంటే, ఆ తండ్రి, కొడుకు మాటలు విశ్వసించకూడదా? ఆదే రంగంలో ఉన్న తండ్రి ఆ విషయాన్ని గ్రహించలేరా? పోనీ మనకా విషయం తెలియనప్పుడు, సంశయనివృత్తి కోరవచ్చునుకదా! కోరలేని పక్షంలో సంయమనం పాటించవచ్చుకదా?

అసలు వాళ్ళబ్బాయి, సినిమా హాల్లొ సినిమా చూడాలేదు, DVD లో చూసాట్ట. piracy కాదూ!
మీరు ముసిలివారైపొయారు ఇంక విశ్రాంతి తీసుకోండీ
మీరు మీ అబ్బాయి పేరు మీద నెలకొల్పిన award ని వనజ కి ఇచ్చారు, అందులో ఇంకా జుగుప్సకరమైన ఘటనలున్నాయి. దానికిలేని అభ్యంతరం దీనికెందుకు? ఫలానా సినిమాలో ఇలాంటి పాత్రవేసారే? మీరూ విమర్శించేవాళ్ళేనా!
ఇవన్నీ కాదుగానీ, అసలు సినిమా తీసినవాడు విదేశీయుడండి, అందుకేనండీ మీ ఆక్రోశం, ఆవేదనానూ!
మనదేశీయుడు తీసిన సినిమాలో ఇంకా జుగుప్సాకరమైన ఘతనలు ఉన్నాయి. వాటిని ఎందుకు విమర్శించలేదు?
మీ విమర్శ, దర్శక-నిర్మాతల విజ్ఞతని కించపరిచేదిగా ఉందండీ!
అసలు విమర్శించే అర్హత మీకు లేదండీ!

ఇవి మరికొంతమంది వ్యక్తపరచిన (యధాతధం కాకపోయినా,భావం మాత్రం అదే) అభ్యంతరాలు. ఎంతసంధర్భోచితంగా ఉన్నాయో అవి మీ విజ్ఞ్తతకే వదిలేస్తున్నాను.

ఒక్క కొత్తపాళీ గారు మాత్రం "అభిరుచుల విషయంలో ఎవరి అభిప్రాయాలు వారివి. కాదనను. వేరే దృక్పథాన్ని మీతో పంచుకోవాలని మాత్రమే ఈ జాబు, పెద్దలతో వాదంఇచాలని కాదు" అంటూ హుందాగా వ్యవహరించేరు/విభేదించేరు.

మనం ఆచరించలేని, అనుసరించలేని పరిపూర్ణస్వచ్చతని, అవతలి వ్యక్తిలో ఉండాలనుకోవడం, మనగురివిందగింజలోలేనితెలుపు అవతలి వ్యక్తిలో ఉండాలి అనుకోవడమే!

చివరిగా

"దీని [SM] దెబ్బకి రేపు రోడ్లమీద అమెరికన్లు నన్నేదో చులకనగా చూస్తారనుకునే న్యూనతా భావం నాకు లేదు. ఒక వేళ వాళ్లలా చూసినా, who cares? " అని అనగలిగిన ఆత్మవిశ్వాసం

"I am entitled to my space to differ" అన్న గొల్లపూడి గారి అభిప్రాయాన్ని, దాంతో పాటు మన విజ్ఞ్తతని, వివేవచని మ్రింగేసే అహంకారం/అహంభావం గా మారకూడదనే నేను కోరుకునేది!

గమనిక: అసలు నాకు పైన ప్రస్తావించబడిన బ్లాగర్లు పరిచయంలేదు. అలాగే గొల్లపూడి గారు కూడా. నిష్పాక్షికంగానే వ్యవహరించానని అనుకుంటున్నా. కొన్ని టపాలని verbatim quote చేసినా, అది వ్యక్తిగతంకాదని, సాధారణ భావజాలానికి ప్రాతిపదికగా మాత్రమే వాడ్డం జరిగిందని మనవి (అందుకే పేర్లు ఉటంకించలేదు). ఎంతోమంది కామెంట్లని ప్రస్తావించేను. అందరిని పేరు పేరునా quote చెయ్యడానికి బద్దకం :)


మరోగమనిక: ఒకొక్కసారి, అసలు ఈ వాదనలలో అర్ధమేలేదనిపిస్తుంది. రాద్దాం అనుకుంటూ, మనం చెప్పేది మనకే వర్తిస్తుంది కదా అని మానేస్తాను (circular reasoning). SM విషయంలో కూడా అనుకుంటుండగానే,
దూల ఎక్కువై,
ఇదిగో ఇగోల గోల
ఈలోగా
ఇలాగ :)

27, ఫిబ్రవరి 2009, శుక్రవారం

గ్లోబలైజేషన్ అంటే?

ఒక ప్రొటెస్టెంటు దేశం, ఒక ముస్లిమ్ దేశాధ్యక్షుణ్ణి వైకుంఠ ఏకాదసినాడు ఉరి తీయడం!

భారత ఆర్ధిక వ్యవస్థకిపునాది మన గృహవ్యవస్థ, పట్టుకొమ్మలు మన ఆడపడుచులు ...
ఇలా ఆద్యంతం ఆశక్తికరంగా, ఆర్ధికవ్యవస్థమీద CA M.R. Venkatesh ఉపన్యాసం కింద తప్పక చూడండి



పనిలో పనిగా తాడేపల్లి వారి నిరుద్యోగం పురుషలక్షణం-౧

9, ఫిబ్రవరి 2009, సోమవారం

రెండవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు - ఫిబ్రవరి 14-16, హైదరాబాదు

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు రెండవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుని
Feb 14-16,2009

మధ్య శ్రీత్యాగరాయగానసభ, చిక్కడపల్లి, హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. కొన్ని ముఖ్యవివరాలు:

మొదటిరోజు (నిర్వహణ: డా|| వంగూరి చిట్టెన్ రాజు) ఉ: 9.30 నుంచి
  • ఇంద్రగంటి శ్రీకాంతశర్మ స్వాగతోపన్యాసం
  • సి.నా.రె ప్రారంభోపన్యాసం
  • తెలుగు ఉపాధ్యాయులకు సన్మానములు (గ్రహీతలు: డా|| తెన్నెటి సుధాదేవి, ఆలూరు శిరోమణి, ఇంద్రగ్ంటి అన్నపూర్ణ)
  • డా|| ఆవుల మంజులత, గొల్లపూడి మారుతీరావు ల ప్రసంగాలు
  • పుస్తకావిష్కరణలు
  • తెలుగు వివిధ దశలు-ఉద్యమాలు పై పోరంకి దక్షిణామ్మూర్తి, విహారి, వల్లావజ్జుల పతంజలి శాస్త్రి, జె. బాపురెడ్డి, ఆచార్య ముదిగొండ శివప్రసాద్ ల ప్రసంగాలు
  • లలిత సంగీతం ( ప్రత్యేక ఆహ్వానితులు వింజమూరి అనసూయాదేవి) సా: 7.00 గంటలకు

రెండవరోజు: (నిర్వహణ: ఇంద్రగంటి జానకీబాల) ఉ: 9.30 నుంచి
  • ముఖ్యాతిధులు ( అబ్బూరి చాయాదేవి, మల్లది సుబ్బమ్మ, వాసా ప్రభావతి, సి. ఆనందారామం
  • వంద సంవత్సరాల తెలుగు సాహిత్య ప్రస్థానంలో రచయిత్రులు, స్త్రీల సాహిత్యంలో వాదనలు, రచనల్లో కుటుంబం-సంఘం-స్త్రీల సమస్యలు
  • సా 6.00 లకు రామాయణంలో స్త్రీపాత్రలలో అంతరంగ నివేదనం (కౌసల్య, శబరి, కైక, సీత మొదలగు పాత్రల సంభాషణ, నాటికలాంటిది)
మూడవరోజు: సా: 6.00 నుంచి
  • మాధ్యమాలలో తెలుగు సాహిత్యం: సినీ రచయితల వేదిక (బలభద్రపాత్రుని రమణి, గొల్లపూడి, పరుచూరి గోపాలకృష్ణ, చంద్రబోసు, అందెశ్రీ, s.v.రామారావు, వడ్డేపల్లి కృష్ణ
  • ముగింపు: శ్రీ గొల్లపూడి మారుతీరావు గారికి జీవిత సాఫల్య పురస్కారం

పూర్తి వివరాల కొరకు:
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
Vamsee International Campus
Satyasaipuram, Kuntloor(V),
Hayatnagar(M)
R.R. (Dist.)
Hyderabad, 501 505, AP
Cell: 98490 23852
email: ramarajuvamsee AT yahoo.co.in

brochure చూడండి

తెలుగుసాహిత్యాభిమానులు, ఔత్సాహిక రచయితలు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ...

30, జనవరి 2009, శుక్రవారం

పరిపూర్ణ పట్టభద్రుడు

లియోనార్డో డావిన్సీ బహుముఖప్రజ్ఞాశాలి. చిత్రకారుడి గా ఎక్కువమందికి తెలిసినా, గొప్ప ఇంజనీరని, మానవ అవయవ నిర్మాణాన్ని కూడా పరిశోధించాడని ఎక్కువమందికి తెలియకపోవచ్చు. అనేక మృతదేహాలని పరీక్క్షించి, తన చిత్రలేఖన చాతుర్యంతో వాటిని శాస్త్రీయంగా గ్రంధస్థం చేసాడు. Proportion of Man అని వ్యవహరింపబడే (ప్రక్క చూపించిన) చిత్రం అనేకమంది ని పరీక్షించిన తరువాత, సగటు (mean) అధారంగా ఒక పరిపూర్ణమానవుని శరీరసౌష్టవం ఎలా ఉండాలి అన్నదానికి సమాధనంగా గీసాడని ఒక వాదన. ఈ చిత్రం మేము తీసిన Proportion of Graduation అనే వీడియో కి ప్రేరణ.

ఇక్కడ graduate అంటే పట్టభద్రుడు. Proportion of Graduation కి దృశ్యరూపం ఇవ్వాలి అంటే, పరిపూర్ణ పట్టభద్రుని లో ఉండాల్సిన లక్షణలు ఏంటి? అది ఎలా సాధ్యం? అన్న ప్రశ్నలకి సమాధాన్ం వెతకాలి( ఇంకా వెతుకుతూనే ఉన్నాం). తెలుసుకొనే ప్రయత్నంలో, ఈ ఉపమానం చూడండి.

ఒక విగ్రహం/శిల్పం తయారు కావాలంటే, శిలతోపాటూ, ఉలి ఇత్యాది పరికరాలని ఉపయోగించి, కఠినమైన శిలకి జీవంపోసి అందమైన శిల్పంగా తయారుచెయ్యగల శిల్పాచార్యుడు కూడా ఉండలి. మరి వీరిద్దరి సంబంధం ఎటువంటిది?

శిల్పంకి ముడి పదార్దం శిలే కదా. అంటే, శిల్పాన్ని ఎవరూ గాల్లోంచో, మరేదో మాయచేసో తయారుచెయ్యలేరు. శిల్పంగా మార్పుచెందగలదు ఏ శిలాఅయినా. కానీ, ఒక అధ్భుత కళాఖండంగా మార్పుచెందాలి అంటే, మారాలనే ఆకాంక్ష శిలకి ఉండడంతోపాటూ, తగిన గురువు చేతిలో పాడాలి. ఉలి ఆటుపోటుల్ని తట్టుకోవాల ఓర్పు, సహనం కావాలి. మరి గురువు లక్షణాలు ఎలా ఉండాలి? తనవద్ద ఉన్న ముడిపదార్ధాన్ని ఎలా మలుచుకోవాలో తెలిసుండాలి. ఉలిని ఓడుపుగా పడుతూ, ఎప్పుడు, ఎక్కడ సుతిమెత్తగా చెక్కాలో, ఎప్పుడు ఎంతమోతాదులో, ఒక్కబాదు బాదాలో తెలుసిఉండాలి. తనఆధీనంలో ఉన్నంతకాలం శిల యొక్క సంపూర్ణభాద్యతవహించాలి.

చివరిగా ఒక masterpiece తయారుకావాలి అంటే ఒక master కావాలి, ఒక piece కూడా కావాలి. పై భావంతో Proportion of Graduaiton వీడియో ని క్రింద చూడండి.

ఇందులో రెండు tracks సమాంతరంగా నడిస్తూంటాయి. అప్పుడే ప్రవేశం లభించిన విద్యార్ధి ఒక పక్క, ఎమీలేని తెల్లకాగింతం ఒక పక్క. తెల్లకాగితం డావిన్సీ వంటి master చేతిలో పడితే, విద్యార్ధి ఒకా అత్యున్నతమైన విశ్వవిద్యాలయం (ఇక్కడ Texas A & M University) లో చేరతాడు. ఇద్దరూ కూడా అత్యంత క్లిష్టమైన పరిస్థితులని విజయవంతంగా ఎదుర్కొంటారు. కాగితం, అద్భుతమైన కళాఖండంగా రూపుదిద్దుకోటే, విద్యార్ధి పట్టభద్రుడై జీవితాన్ని ఎదుర్కోవడనికి సన్నద్ధుడౌతాడు.




Discover the masterpiece within
A & M: Finest craftsmen since 1876

అన్న tag-line తో ముగుస్తుంది.

వీడియో గురించి కొన్ని విశేషాలు:
  • ఇందులో నటించిన అబ్బాయి undergraduate, రష్యన్
  • అసలు footage అంతా shoot చేసేవరకు ఈ concept అనుకోలేదు. దాదాపు editing తోనే ఈ story చెప్పడం జరిగింది
  • నేపధ్యసంగీతం అందించిన వ్యక్తి myspace లో పరిచయం. ఫ్రాన్స్ దేశస్థుడు

20, జనవరి 2009, మంగళవారం

ఆంధ్రామృతం దత్తపూరణం

ఆచార్యులు చింతా రామకృష్ణారావు గారిచ్చిన దత్తపూరణం

"అక్క, చెల్లె, బావ, అన్న" అన్న పదాలతో "రామాయణానికి" సంభందించి ఒక పద్యం రాయాలి. నేను చేసిన ప్రయత్నం ఆటవెలది లో:

ఆ.వె:
"బావ" యనుచు వెంటపడిన రావణుచెల్లె
లముకుచెవులు కోసె లక్ష్మణుండు
అక్కసుతొవెడెలెను రక్కసి "అమ్మా! హు"
అని వగచుచు చేరెనన్న దరికి

ఇందులో, "బావ యనుచు వెంట పడిన" అన్న ప్రయోగం కొంచం వాడుకభాషకి దగ్గరలో ఉంది. దీని ఇంకాబాగా రాస్తే బావుణ్ణు. కానీ ఛందస్సుతో పని కాబట్టి నాకింకా అంత భావస్వేచ్ఛ రాలేదు. ప్రస్తుతం ఛందసు కోసమే ప్రయాస పడాల్సి వస్తొంది.

ఆచార్యులు కొన్ని తప్పులు సవరించారు. వాటిని comments లో చూడగలరు.

17, జనవరి 2009, శనివారం

దద్దోజనం మీద

ఆ.వె
గుమ్మపాల పెరుగు, కమ్మని తాళింపు
మేళవించినన్నమె గద, విందు
లందు జిహ్వనాడులచెలి దద్దోజనం
తన్నెఱగని జనము దద్దు జనమె!


భావం:
గుమ్మపాలుతోడుపెట్టిన గడ్డపెరుగు అన్నంకి,
ఎండుమిరప, శనగపప్పు ఇత్యాలుదలతో పోపు ( తాళింపు) పెడితే, రుచిని గ్రహించే నాడులకి ప్రియమైన దద్దోజనం సిద్ధం.

ఇంతవరకూ భోజనంలో దద్దోజనం తినని జనం, నిజంగా దద్దు (నిర్భాగ్య) జనం సుమీ! :)

గమనిక:
1)ఇది సరదాకి రాసినది, ఆటవెలదితో కూస్తీలో భాగంగా!
2)వ్యాకరణంలో దోషాలున్న తెలుపగలరు.

సమోసా : వహ్ క్యా బాత్ హై

ఇది బహుళ జనాభిప్రాయమే కదా! మరి ఆటవెలది లో సమోసాపై పద్యం చూడండి:

ఆ.వె
దట్టముగను, కట్టుదిట్టముగను పిండి
పొట్టనాలుగడ్డ, పోవునంత
ఉల్లిగడ్డ, బాగమఱిగినానూనెలొ,
వేగినా సమోస, వడిగతినుము! ||
ఎందుకు అంటారా, ఆలసించినఆశాభంగం
ఎందులకింకెందులకీ సమాలోచనలు
సాలు, సాలు, రసాలూరు సమోసాలు!
అంటూ సమోసాలు తింటూ బ్లాగులు చదువుకోండి :).
పై పద్యం మొన్న potluck dinner లో మా అందరికీ సమోసాలు చేసిపెట్టిన భానువాళ్ళ అమ్మగారికి అంకితం


ps: పెద్దలు వ్యాకరణ దోషాలు ఉంటే సూచించగలరు.

15, జనవరి 2009, గురువారం

ఆటవెలది లో మొదటిపద్యం

నేనింతవరకూ ఛందోబద్ధంగా ఎప్పుడూ రాయలేదు. నాకు ఎప్పటినుంచో ఈ కోరిక తీరని కోరికలాగే ఉండిపోయింది. ఆంధ్రామృతం వారు ఆశువుగా పద్యాలు చెప్పడం చూసి, స్ఫూర్తిపొంది ఈ ప్రయత్నం చేస్తున్నాను.

ఆటవెలది:
జఱభి నవ్వినంత, జాణతనంబంత
నెఱగి జాబిలి, విటునె మరపించె
ఉత్పలాక్షి గాంచి ఊసులుబోయెనా
వన్నె, విరిసి మెరిసి వెన్నెలగుచు

ఆటవెలది ఓ చిన్ననవ్వు విసరగానే, అందులోని జాణతనమంతా గ్రహించినా చందురుడు, రసికాగ్రేసరుడైన విటుడినే మరపించేడు. కలువల వంటి కన్నులుకల ఆ జవ్వనాంగిని చూడగానే, కలువలరేని వన్నెలు, చిన్నెలు, వెన్నలగ మారి విరిసేయి, మెరిసేయి.

పద్యం ఎన్నోరూపాంతరాలుచెంది ఆవిధంగా వచ్చింది. ఎన్నిమార్పులు, చేర్పులూ జరిగేయి, పద్యంరాయడంలో పడ్డపాట్లు గురించి తెలుసుకోవాలంటే ....


ఎలా అనేది క్రింద వివరించాను చూడండి.

ముందు రాసింది ఇది:
ఉత్పలాక్షిన్ గాంచిన, శశి ఉష సొగసుల
వన్నె, వెన్నెలందు విరిసె, మెరిసె
జఱభి నవ్విన, జాబిలి చెక్కిలి, చికి
లించిన చెలియ కలల కనుబొమ్మ

భావం:
కలువల వంటి కన్నులు గల చిన్నాదాన్ని చూసిన కలువలరేని (చంద్రుని) కాంతుల సొగసులు వెన్నెలలో విరిసి, మెరిసేయిట. ఆ సుందరాంగి నవ్వితే, చంద్రుడి బుగ్గలు, ఆమె అందమైన కనుబొమ్మల్లా బాణంవంగినట్టు సొట్టబోయాయిట.

ఆటవెలది లక్షణాలు:
1) ఒకటి, మూడు పాదాల్లో రెండు ఇంద్రగణాలు, మూడు సూర్య గణాలు ఉండాలి
2) రెండు, నాలుగు పాదాల్లో అయిదు సూర్య గణాలు ఉండాలి
3) ప్రతీ పాదంలో మొదటి అక్షరం, నాల్గవ గణంలో మొదటి అక్షరం తో "యతిమైత్రి" ఉండాలి.

వీటిని ఆధారంగా రాసిని పద్యాన్ని చూద్దాం:

మొదటి పాదం గణ విభజన:
(btw, U అంటే గురువు, I అంటే లఘువు)
  1. ఉత్పలాక్షిన్(UIUU) గాంచిన(UII), శశి(II) ఉష(II) సొగసుల(IIII)
  2. కలిపిరాస్తే UIUUUIIIIIIIIII
  3. గణాలుగా విభజిస్తే UIU, UUI, III, III, III
  4. అవివరుసగా ర, త, న, న, న
  5. ర, త లు ఇంద్రగణాలు, న సూర్య గణం
  6. ఊ, ఉ లు యతిమైత్రి కలిగిఉన్నాయ
రెండవ పాదం గణ విభజన:
  1. వన్నె(UI), వెన్నె(UI) లందు(UI) విరిసి(III), మెరిసె(III)
  2. కలిపిరాస్తే UIUIUIIIIIII
  3. గణాలుగా విభజిస్తే UI, UI, UI, III, III
  4. అవిఅన్నీ గలము, గలము, , గలము న, న (, గలము అంటే "గురువు+లఘువు"అని)
  5. "గలము", "న" ఇవి మాత్రమే సూర్య గణాలు
  6. వ, వి లు యతిమైత్రి కలిగిఉన్నాయ
మూడా పాదం గణ విభజన:
  1. జఱభి(III) నవ్విన(UII), జాబిలి(UII) చెక్కిలి(UII), చికి(II)
  2. కలిపిరాస్తే IIIUIIUIIUIIII
  3. గణాలుగా విభజిస్తే III, UII, UII, UI, III
  4. అవిఅన్నీ న,భ, భ, గలము, న, గణాలు
  5. "గలము", "న" ఇవి మాత్రమే సూర్య గణాలు, మిగతావి ఇంద్రగణాలు
  6. జ, చె లు యతిమైత్రి కలిగిఉన్నాయ
నాల్గవ పాదం గణ విభజన:
  1. లించిన(UII) చెలియ(III) కలల(III) కనుబొమ్మ(IIUI)
  2. కలిపిరాస్తే UIIIIIIIIIIUI
  3. గణాలుగా విభజిస్తే UI, III, III, III, UI
  4. అవిఅన్నీ "గలము", న, న, న, "గలము", గణాలు
  5. "గలము", "న" ఇవి మాత్రమే సూర్య గణాలు
  6. లి, ల యతిమైత్రి కలిగిఉన్నాయ
కాని:
పెద్దలు చింతా రామకృష్ణారావు గారు, నరహరి గారు, రాఘవ గారు, , చదువరి గారు కొన్ని తప్పులు పట్టేరు వారికి నా కృతజ్ఞతలు.

అవి:
1) ఆ.వె లో మొదటి, మూడు పాదాల్లో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు వరసగా రావాలి. నేను మొదటి రాసినదాంట్లో, ordering లేదు.
2) ఆ.వె లో యతిప్రాస కుదురుతుంది. ఇంతకుముందు ఈ విషయంనాకు తెలియదు.
పై రెండు సూచనలనీ పరిగణన లోకి తీసుకొని, ముందు రాసిన పద్యాన్ని ఈ విధంగా మారిస్తే,

జఱభి నవ్వినంత, జాణతనంబంత
నెఱగి జాబిలి, విటుని మరపించె
ఉత్పలాక్షిని గనినంత, పున్నమిరేని
వన్నె, విరిసె మెరిసె వెన్నెలగుచు

వచ్చింది. మీరు గమనిస్తే, మొదటి రెండు పాదాల్లోనూ, యతి, చివరి రెండు పాదాల్లో ప్రాసయతి కి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. కానీ, ఇందులో కూడ తప్పులు ఉన్నాయి. ఆచార్యులు చింతా రామకృష్ణారావు ఎంతో వ్యయప్రయాసలకోర్చి, సవివివరంగా comments ద్వారా తెలియజెప్పేరు. వారు సూచించినవిధంగా రెండో పాదంలోను, మూడోపాదంలోనూ యతిని సరిచేస్తే వచ్చినది:

జఱభి నవ్వినంత, జాణతనంబంత
నెఱగి జాబిలి, విటునె మరపించె
ఉత్పలాక్షి గాంచి ఊసులుబోయనా
వన్నె, విరిసి మెరిసి వెన్నెలగుచు


నేను పైనవ్యక్తపరచినవి ఒక చిన్న పుస్తకం చూసి నేరుచుకుని, extrapolate చేసినవి. నాకు వీటిమీద పెద్దగా జ్ఞానంలేదు. పదోతరగతి వరకు కొంచం తెలుగు వ్యాకరణం చదువుకొన్నాను. ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్ధూలం ఇవి మాత్రమే చదివినట్టుగుర్తు. అవిమరచిపోయి దశాబ్దంపైగాకావస్తోంది. అందుకే, ఒక వ్యాకరణ పుస్తకం ముందు పెట్టుకొని, కొంచం practice చేసాను. తెలిసిన పద్యానికి, గణవిభజన వగైరాలని. పద్యం ఇస్తే, అది కోవలోకి వస్తుందోచెప్పడం వరకూ పర్వాలేదు, కానీ, సూత్రాలని అనుసరిస్తూ రాయడం మాటలు కాదు అని తెలిసుకున్నాను. అప్పుడు, మన కవులమీదా అమాంతం గౌరవభావం, ఆరాధ్యనాభావాం ఉన్నదానికి ఒక వెయ్యిరెట్లు పెరిగాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తిలేదు.

నేను పైన రాసిన నాలుగు పదాలు చాలా వరకు trial & error తరువాత వచ్చినవి. ఎలాఅంటే:

స్థూలంగా ముందు ఒక భావంకొని, rough draft తయారుచేసి, లఘువులుగా, గురువులుగా, విభజించి, గణాలు గుర్తించాలి. తరువాత అవి ప్రాధమిక సూత్రాలకి అణుగుణంగా ఉన్నాయోలేదో చూసుకోవాలి. అలా లేకపోతే నానార్ధాలో, పర్యాయపదాలో వాడడం, లేదూ అంటే వ్యాక్యాన్ని direct/indirect speech, active/passive voice లాగ మార్చడం, ఇంకా కుదరకపోతే, కొంచం భావమార్చడం చెయ్యాలి. నామటుకు, ఇదొక maths puzzle లా అనిపించింది. ఆటవెలది లో, ఉండాల్సినవి సూర్యగణలు (మొత్తం 2), ఇంద్రగణాలు(మొత్తం 16). గణవిభజన (parsing) ఎలాగైనా చెయ్యొచ్చు (మొత్తం 5 గణాలు ఉండేలా చూసుకోవాలి). కాబట్టి చాలా freedom ఉంది. ముందు ఒక రెండు పదాలు, చివర పదం అనుక్కొని, మధ్యలో ఏఏ పదాలు పడతాయో permutations ద్వారా ప్రయత్నించొచ్చు. ఇవి నేను try చేసిన methods. కావునా, handle with care :)


ps: వ్యాకరణం, ఛందస్సు తెలిసినవారు ఇందులో ఏవైనా తప్పులుంటే సరిదిద్దగలరు.

13, జనవరి 2009, మంగళవారం

ఈ కాలం కుర్రాళ్ళకి

taste అంటూ ఒకటి ఏడ్చింది కదా!

ఏంటి అలా గుర్రుగా చూస్తున్నారు? ఈ మాటలు నేనన్నవి కాదు. TV9 ఏంకరమ్మో, ఏంకరమ్మకి రాసిపెట్టిన రైటరుదో!

విషయం ఏమిటి అంటే, అ మధ్యఎప్పుడో tv9 వాళ్ళు "youtube లో telugu spoofs" మీద కార్యక్రమం ప్రసారం చేసేరుట. అందులో మీవీడియో కూడా ఉంది చూడాండి అని ఒక స్నేహితుడు ఈ లంకె(వీడియో) పంపాడు. అంతా బానే ఉందికానీ, spoofs ని cover చేస్తూ, మధ్య మధ్యలో ఏంకరమ్మ వ్యాఖ్యానమే, బియ్యంలో రాళ్ళ లాగ, కలుక్కు, కలుక్కు మంటూ!

అందులో మచ్చుక్కి:
"ఈ కాలం కుర్రాళ్ళకి taste అంటూ ఒకటి ఏడ్చిందికదా".

ఓసి నీ దుంపతెగా!
ఏంకరమ్మా, ఏమి మా ఖర్మా,
అనుకోవడం మా వంతయ్యింది.

ps: మీరు కూడా నేనిచ్చిన లంకె కి వెల్లి (ఆ ఏంకరమ్మ అలాగే పలుకుతుంది మరి, "వెళ్ళి" అనలేదు కాబోలు, వీళ్ల తెగులు తగలెయ్య ) ఏంకరమ్మా, ఏమి మా ఖర్మా, అనుకోవడం మీ వంతవుతుందేమో చూడండి.

11, జనవరి 2009, ఆదివారం

బోటనీ పాఠముంది - పపాజాను పిజ్జ ఉంది

"బోటనీ పాఠముంది, మేటనీ ఆట ఉంది,
సోదరా ఏది బెస్టు రా!!!"
ఈ పాట మీ అందరినోటా బాగానే నాని ఉంటుందని నా అభిప్రాయం. మరి దానికి ఈ "పేరడీ" పాట చూడండి

అతడు:
papa john pizza ఉంది, burger-king burger ఉంది
సోదరా ఏది బెస్టు రా!
subway sub ఉంది, McD Mac ఉంది
దేనికో ఓటు చెప్పరా!
ఆమె:
pizzaలు, burgerలు తిన్నవాళ్ళు,
బస్తాల్లా, గిస్తాల్లా, బలిసి పోతరు

ఆవకాయ పప్పుకూడు తినిచూడు,
ముందరా, వెనాకాలా తేడచూడు!
జిగడ జిగడ... జిగడ,జిగడ జా....
అతడు:
car లో gas లేదు, race లో ace లేదు
మార్గమే చెప్పుగురువా!
అప్పులే పెరిగిపోయె, పప్పులే కరిగిపోయె
problem ఏ solve చెయ్యవా!
కొండలా course ఉంది, ఎంతకీ తరగనంది,
ఏందిరో ఈ గొడవా!
ఆమె:
ఎందుకూ హైరాణా చిట్టినాన్న
వెళ్ళరా సులువైన రూటులోనా!
వద్దురా Ph.D పట్టా గోల, చాలురా Masters ఇకనైనా!
జిగడ జిగడ... జిగడ,జిగడ జా....
అతడు:
Bostonలో బాల ఉంది, Houstonలో కేళి ఉంది
సోదరా ఏది best రా!
ఆమె:
Bostonలో బాలగోల మనకేలా,
Houstonలో కేళి అంటే ఒళ్ళు గుల్ల!
జిగడ జిగడ... జిగడ,జిగడ జా....
అతడు:
Bush లా బుస్సుమనే, Saddam లా తుస్సు మనే ఎవ్వడీ సీమరెడ్డి

అందరూ:
తందనా తందననా, తందనా తందననా,
తందనా తందననా....
అంటూ ముగుస్తుంది. ఆ వీడియోని క్రింద చూడండి


ఈ పాట కోసం రాసుకున్న, వాడని చరణాలు/పల్లవి:

  1. carl marx పాఠముంది, cinemark సినిమా ఉంద, దేనికో ఓటు చెప్పరా!
  2. wikipedia site ఉంది, youtube video ఉంది, ఇందులో ఏది best రా!
  3. Algebra class ఉంది AlJajeera TV ఉంది, ఇందులో ఏది best రా!
  4. subway sub అంటె డబ్బు, డబ్బు, McD Mac అంటే, దగ్గు, దగ్గు,
  5. starbucks coffee అంట, తగ్గు తగ్గు, జిగడ జిగడ ....
క్రెడిట్స్:
గాయని: మైత్రిరెడ్డి ముద్దసాని
కొరెయోగ్రఫీ: వీచిక ఇరగవరపు/సోమశేఖర్ ధవళ
కెమెరా: శిరీష్ కౌశిక్ లక్కరాజు/సోమశేఖర్ ధవళ
రచన/గానం/కూర్పు/దర్శకత్వం: సోమశేఖర్ ధవళ
సలహాదారు: అరుణ

పైపాట తియ్యడం కోసం మేముపడ్డ పాట్లు గురించి...

ఇందులో మీరు చూసినవారందరూ, college students యే! ఎవ్వరికీ ఇంతకుముందు నటించిన అనుభవంలేదు. అందులోనీ, తెలుగు సినిమా పాటలకి అవసరమయ్యే Dance Steps అసలు రావు. అంతమందినీ పెద్ద class room hall ముందు సమావేశపరిచి, కొంచం చేతులు, కాళ్ళు, నడ్దీ ముడ్డీ ఊపడం నేర్పేము. Song background లో play చేస్తూ, కాసేపు Drill practice చేయించాం. తరువాత left, right చేతులు చాపుతూ చప్పట్లు కొట్టడం, ఇవి మా వీడియోలో choregraph చెయ్యబడిన steps. ఈ తతంగం అంతా అయ్యేసరికి ఒక మూడు గంటలు పట్టింది. అన్నీటికన్నా ఎక్కువ, train పెట్టెలా నడుస్తూ చప్పట్లు కొట్టడం. అందరూ కుడివైపుకి కొడితే, ఒక్కడు మాత్రం ఎడమవైపుకి కొడతాడు. అంతమందినీ synchronize చేసేసరికి మూడు చెరువుల నీళ్ళు తాగాల్సొచ్చింది. కాకపోతే అంతమందీ ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదట్లో కొంచం సిగ్గుపడినా గాని. ఇంక, వీడియో తీసే క్రమంలో జరిగే goof-ups ఎన్నో.

పాట గురించి కొన్ని సాంకేతిక విషయాలు:
ఇందులో పాడిన అమ్మాయి, చాలా బాగా పాడుతుంది. కానీ, male singers విషయానికొచ్చేసరికి మాకు ఎవరూ దొరకలేదు. దాంతో, track singer లా నేను పాడాను. తరువాత ఎవరైనా తెలుగు బాగా పాడేవాళ్ళు దొరికితే వాళ్ళాచే పాడిద్దామని. కాని, editing చాల time-taking process. అందుకే మళ్ళే అవన్నే చేసే ఓపికలేక, నేను పాడిన version ఏ ఉంచేసాం. అదే మీరు విన్నారు (పాపం, మీ ఖర్మ కాకపోతేనూ).

original song ని audacity లో edit చేసాము. మాకు కావాల్సిన basic beat patterns ని original song నుంచి extract చేసాం. తరువాత, ఆ beats తో loops create చేసాం. దాని మీద voice track ని overlay చేసాం. చివర్లో "తందనా తందనా ..." అని chorus లా ఉంది కదా. అది in fact ఒకరు పాడిందే. ఒక track తీసుకొని, కొంచం delay చేసి, అలాంటివి several versions add చేస్తే మీకు chorus effect వస్తుంది.

ఇది మేము Shiva born again అని ఒక సినిమాలాంటి వీడియో తీసిన ప్రయత్నంలోనిది. దానిపై మరెప్పుడైనా,
అంతవరకు శెలవు!

2, జనవరి 2009, శుక్రవారం

పిల్లమారుతం

వరాళి వీచిక. ఈ పేరు చాలా బావుంది కదూ. ఈ పేరు తో బ్లాగు రాస్తున్న శ్రావ్యవరాళి అనే ఎనిమిదో( లేక తొమ్మిదో) తరగతి చదువుతున్న చిన్నారి ఆలోచనలు అంతకంటే బావుంటాయి. గతసంవత్సరం లోసంభవించిన "ముంబయి ఘాతుకం" నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చోవివరిస్తున్న వరాళి వీచికను ఇక్కడ చూడండి

ఆశావాదులు పరాజయాన్ని కూడా విజయానికి సోపానంగా ఎలామలచుకోవచ్చో చెప్పినట్లు లేదూ?

ఈ పిల్లమారుతానికి ఈ సందర్భ్ంగా నా అభినందనలు!

లోక్ సత్తాకు నిజమైన గుర్తింపు

మంత్రి షబ్బీర్ అలీ నేర చరిత్రని ఉటంకిస్తూ ప్ర.రా.ప నేత ఖలీల్ బాషా
"ఈయన లోక్ సత్తా చరిత్రహీనుల జాబితా లో ఉన్నాడు"

అని అన్నట్టుగా వచ్చిన వార్త విని నాకనిపించింది లోక్ సత్తాకి ఇది నిజమైన గుర్తింపని. రాజకీయ ప్రత్యర్ధి నమ్మకం చూరాగొనడం ఈ రోజుల్లో సాధ్యపడేపనేనా ఇది. దాన్ని సుసాధ్యంచేసిన లోక్ సత్తా కి నా శుభాభినందనలు.


1, జనవరి 2009, గురువారం

ప్రతిభా ( పాటవాలు లేని ) పాటిల్

ప్రతిభా పాటిల్.
కాదు, ప్రతిభలేని పాటిల్.
అంతేకాదు ప్రతిభతో పాటూ పాటవం కూడా లేని పాటిల్.

కొంగుకప్పుకొని ఆవిడ ఉండే ఏ ఛాయాచిత్రాన్ని చూసినా నాకు కలిగే భావన ఇదే! మనం ఒక పది తరాలు వెనక్కి వెళ్ళిపొయినట్టుగా ఉంటుంది. ఈవిడేనా మన త్రివిధదళాధిపతి అనిపిస్తుంది. ప్రతీ గణతంత్రదినంనాడూ ఇచ్చే ఉపన్యాసాలు విని/చదివి స్ఫూర్తిపొందిన వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా అని నా అనుమానం. మనరాజ్యాంగంలో, రాష్ట్రపతి పదవి రబ్బర్ స్టాంప్ అయితే, ఈవిడ ఆ మూసలో అచ్చుగుద్దినట్టుగా సరిపోతారు. సినీపరిభాషలో చెప్పాలంటే ఆ పాత్రకి "పూర్తి" న్యాయంచేస్తారు.

మన్మోహన్ సింహ్ గారు కూడా అలాగే తోస్తారు. అయన జ్ఞానే కావచ్చు, కానీ వెన్నెముకలేని నాయకునిలా కనిపిస్తారు. మానవమృగాలు స్వేచ్ఛగా సంచరించే "zoo" లో బంధించ బడ్డ ఈ సింహం జూలు విదిలిస్తే, ఆ జూలు రాలిపోతుందని జాలి కలుగుతుందే తప్ప, మనతోలుతీసి డోలువాయించగలదని ఎవరికైనా అనిపిస్తుందా?

"తీవ్రవాదుల్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం" అని వీరిద్దరిలో ఎవరైనా ఘర్జిస్తున్నప్పుడు,
గుండె వేగంగా కొట్టుకుంటూ,
రోమాలు నిక్కబొడుచుకుంటూ,
కనుబొమ్మలు దగ్గరైతూ,
మెదడులో "నేనుకూడా అందులో ఒక సైనికుణ్ణి కావాలి "
లాంటి ఆలోచనలు మొదలుతయా? లేక

పెదవులమీద ఒక నిరాశక్తి, నిర్లిప్తలతో కూడైన నవ్వు,
నేను ఏడ్వలేక నవ్వుతున్నాను అంటుందా?


గమనిక: ఇది పూర్తిగా నిరాధారపూరితమైన భావన. ఎవర్ని చూసినా ఒక అభిప్రాయ్ం (తప్పో, ఒప్పో) ఏర్పరుచుకుంటాం. ఇది కూడా అలాంటిదే!

నూతనవత్సర శుభాకాంక్షలు

మిత్రులకు, హితులకు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు, అందరికి:
ఈ సంవత్సరాది,
మీ అయ్యురారోగ్యాలకు, సుఖసంతోషాలకు, సకల ఐశ్వర్యాలకు
మరోపునాది కావలని ఆకాంక్షిస్తూ,

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును