18, డిసెంబర్ 2009, శుక్రవారం

తెలంగాణా సమస్య - ఒక రాజీ పరిష్కారం

తెలంగాణా విభజనవాదులు: ప్రత్యేక రాష్ట్రం కావాలిసిందే. ఎందుకంటే
1) మా వనరుల మీద అధికారం మాకే కావాలి
2) ఎన్నోసార్లు రాజకీయనాకుల చేతిలో మోసపోయాం. దోపిడీలకు గురయ్యాం. ఇక మావల్ల కాదు
3) చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యపడుతుంది
4) తెలుగు వారమైనా మా సంస్కృతి, సాంప్రదాయం వేరు. ఈ బలవంతపు వివాహం నుంచి మాకు విడాకులు కావాలి.
5) నిధులు, వనరుల పంపిణేల్లో, అన్యాయానికి గురి అవుతున్నాం.
6) సమైఖ్యాంధ్రా కోరుకునే వాళ్ళకి నిజంగా హైదరాబాదే కావాలి. హైదరాబాదు తెలంగాణాలో అంతర్భాగం. ఇది నైజాముల కాలంనుంచే అభివృద్ధి చెందిన నగరం. మీరొచ్చి కొత్తగా ఊడబొడించింది లేదు.

భౌగోళికంగా వేరైనా మానసికంగా కలిసుందాం (లేదా అందుకు ప్రయత్నిద్దాం)

సమైఖ్యాంధ్రా కోరుకునే వారు:
1) అసలు విడిపోవడమన్నదే పరిష్కారం కాదు. కలిసి ఉంటే కలదు సుఖం. చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి సాధ్యం (ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో) కాకపోవచ్చు.
2) రాష్ట్ర విభజన వల్ల అనర్ధాలు ఎన్నో. ఇది రాష్ట్ర సమస్యేకాదు. జాతీయ భత్రతో ముడిపడి ఉన్న సమస్య కూడా. నక్సాలిజం, తీవ్రవాదం, వేర్పాటువాదం వంటివి మరింత ప్రజ్వరిల్లవచ్చు.
3) ఇన్నాళ్ళు మీ ప్రాంత రాజకీయనాకులు వెలగబెట్టిందేంటి? ఇది రాజకీయనాయకులు స్వప్రయోజనాలకోసం, తమ ఉనికి కోసం తిరగదోడిన సమస్య. అయినా రాయలసీమ వెనకబడి లేదా? ఉత్తరాంధ్రా వెనకబడిలేదా. మీ వెనకబాటుదనానికి అంధ్రావాళ్ళని దోపిడీ దారులనడం, నిజంగా గర్హించవలసిన విషయం.
4) ఇక ముఖ్యంగా, హైదరాబాదు లో నివాసం, వ్యాపారాలు వృద్ధి చేసుకున్నవారి పరిస్థితి ఏంటి. వాళ్ళకి భద్రత ఏది. మీరిచ్చే వాగ్దానాలు తుంగలో తొక్కరన్న నమ్మకమేమిటి. ఇన్నాళ్ళూ మేము కూడా, హైదరాబాదు అభివృద్ధిలో పాలుపంచుకున్నాం. మేము పోషించినా హైదరాబాదు మాకు లేకపోవడం అన్యాయం.
5) ఒకవేళ తెలంగాణా వచ్చిన పరిస్థితులలో, ముఖ్యంగా, నీళ్ళ దగ్గర, ఇతర రాష్ట్రాల్లాతోవాళ్ళాలాగే తగవులాడుకోవాలి.

ఇప్పుడు ఎలా వుంది అంటే, కరవమంటే కప్పకి కోపం, విడవ మంటే పాము కోపం లాగ తయరయ్యింది. అసలు కథ ఇంత దూరం వచ్చిన తరువాత, కలిసున్నా విడిపోయినట్టే. ఈ పీటముడి ఇప్పడానికి, నాకు హైదరాబాదు, జలవనరులపై ఆధిపత్యం ప్రధాన అడ్డంకులుగా కనిపిస్తున్నాయి.




కాబట్టి నేను సూచించే పరిష్కారం, రాష్ట్రా విభజన ముఖ చిత్రాన్ని మార్చి, విభజన చేయటం. కాకపోతే, రెండు సమూహాలూ పట్టువిడుపులు ప్రదర్శించాలి. (ప్రక్క పటం చూడాండి. నీలి రంగు గీత కొత్త విభజన రేఖని సూచిస్తుంది)

1) రాయలసీమ, కోస్తాంధ్రలలో, మెహబూబ్నగర్, సగం రంగారెడ్డిని ని కలపాలి. అంటే, తెలంగాణా ఒక జిల్లాని కోల్పోవాలి. అలాగే సగం రంగారెడ్డి కూడా. సీమాంధ్రలు, విభజనకి అంగీకరించాలి.
2) హైదరాబాదు ఉమ్మడి రాజధాని గా చెయ్యాలి
3) రెండు కొత్త రాష్తాల మధ్య కొన్ని ప్రత్యేక అవగాహనలు ఉండాలి (వాహనాలు, జలవనరులు, రవాణా ఇలాంటి విషయాల్లో)
4) క్రిష్ణా పై అధిక హక్కులు సీమాంధ్రకి వస్తాయి. గోదావరిపై నియంత్రణ తెలంగాణాకి లభిస్తుంది.
5) నాగార్జునసాగర్ పై రెండు రాష్ట్రాలకి హక్కులు ఉండాలి.
6) హైదరాబాదు ని ఫ్రీజోన్ గా కాకుండా, ఫ్రోజెన్ జోన్ గా ప్రకటించాలి. ప్రత్యామ్నాయంగా మూడు ప్రాంతాల్లో (తెలంగాణా, రాయలసీమ, కోస్తాల్లో ఒకటి చొప్పున), మూడు ప్రాంతాలని అభివృద్ధి పరచాలి (అభివృద్ధి వికేంద్రీకరణ కోసం)

అలోచించవలసిన విషయం:
తెలంగాణా వాదులు: ఇప్పుడు మీరు మహబూబ్ నగర్, సగం రంగారెడ్డిని కోల్పోతున్నారు. హైదరాబాదు ని పంచుకుంటున్నారు. ఇప్పుడు మీకు అర్ధమవుతోడా, విడిపోవడం, విభజనలో బాధ? మీరు నిజంగా, తెలంగాణా అభివృధి కాంక్షించేవారే అయితే, మహబూబ్ నగర్ సీమాంధ్రలో వున్నా, తెలంగాణాలో ఉన్నా పెద్ద తేడా ఉండదు, ఇప్పుడు రెండూ చిన్నా రాష్ట్రాలే కాబట్టి.

తెలంగాణాలో, గోదావరీ పరివాహక ప్రాంతమే ఎక్కువ కాబట్టి, దానిపై ఎగువ నియంత్రణ మీచేతికిందకే.

సమైఖ్యవాడులు: దీనివలన, హైదరాబాదు పై అనవసర ఆందోళణలు అక్కర్లేదు (ఉమ్మడి రాజధాని కాబట్టి). క్రిష్ణా పై అధిక నియంత్రణ వస్తుంది. ఏదో ఒకటి వొదులుకోక తప్పదు కాదా, విభజన అన్న తరువాత. అసలు కొంతమంది తెలంగాణావాదుల వాదన చూస్తే, వాళ్ళ ఆరోపణలకి మనసు విరిగిపోతుండి. కలిసుండి వేర్వేరుగా ఉండేకన్నా, విడిపోయి కలిసుండడమే ఉత్తమమేమో.


(ఇది ఒక ప్రతిపాదన మాత్రమే. నాకున్న సమాచారంతో ఈ సూచన చేయడం జరిగింది. ఎవరి మనసు నొప్పించినా క్షమించ గలరు. ఈ టపా పై నేను మరి ఇక వ్యాఖ్యానించను.)

8 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

makes lot of sense. But I don't think "Telabaans" would be ready for this solution. They want control of 100% hyd income. nothing more, nothing less.

అజ్ఞాత చెప్పారు...

To Anonymous
If you say Telangana people are "Telabans", now I can say andhra people also "Andhrabans". By this way no problem will solve. He has given one solution if you have opinion post it otherwise keep quite. Bad people are there in both regions. Dont think all your people are innocents. Frankly tell me, if your people are so much innocents, why Rayalaseema people are not ready to stay with you.

అజ్ఞాత చెప్పారు...

Telangana people and Telabans are different. Just as Muslims and and Al Qaeda are diifferent. Telabans are probably those who lost their commonsense and faculty of proper judgement due to their regional fanaticism and madness.

kvrn చెప్పారు...

indeed a very good proposal. the govt should work on this. Hyderbad city and High court can be common. OR Greater Hyderbad city can be made seperate state or union territory. Daanam, mukhesh gowd will agree. most of circar, rayalaseema leaders agree if hyderabad city is made union territory. then two separate new capitals can be build with equal trouble, expense and time.

నాగప్రసాద్ చెప్పారు...

పరిష్కారం బాగుంది కానీ, అప్పుడు కే.సీ.ఆర్ కూడా ఆంధ్రావాడు అయిపోతాడు. :)

కే.సీ.ఆర్ పాలమూరు M.P. అని మీరు మర్చిపోయినట్టున్నారు. :) :) :)

పాలమూరు = మహబూబ్ నగర్

అజ్ఞాత చెప్పారు...

అసలు కొంతమంది తెలంగాణావాదుల వాదన చూస్తే, వాళ్ళ ఆరోపణలకి మనసు విరిగిపోతుండి. కలిసుండి వేర్వేరుగా ఉండేకన్నా >> very much true

Nrahamthulla చెప్పారు...

రైల్వేలో మన రాష్ట్రానికి ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది కాబట్టి,ఆంధ్రపదేశ్‌ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలి లాంటి వితండవాదనలు ఏదో రకంగా మొండిగా సమైక్యవాదాన్ని సమర్దించటం కోసమే గానీ వాదనలో పస లేదు.జై ఆంధ్ర అంటాను జైతెలంగాణా అంటాను.విడిపోతే తప్పేంటి అనే వెంకయ్యనాయుడులాగా సమైక్యవాదులు ఎందుకు కలిసుండాలో కారణాలతో సహా స్పష్టంగా చెప్పాలి.మన పక్కనే ఉన్న యానాం ను రాష్ట్రంలో కలపాలని అడగకుండా సమైక్యవాదులు ఎందుకు విడిచిపెడుతున్నారో అర్ధం కావటం లేదు.ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.యానాంను తెలుగు ప్రాంత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి.

oremuna చెప్పారు...

This is nonsense.

Keeping Telugu United is the only solution. All the issues can be resolved. (except raajakeeya nirudyOgaM ofcourse)

what if Telabans asks for one district from kosta so that they can get ocean?

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును