29, డిసెంబర్ 2009, మంగళవారం

Godavari River - Altitude profile

Using topocoding.com's API available to map the altitudes, I created the profile of Godavari River's altitude.

The starting point is at Basara ( AP-Maharastra border) from where Godavari flows exclusively in AP and the end point is Bay of Bengal, where it terminates at yanam.




This total length, according to the profile plot, is about 720 kms.

You can see that there is one minor dip in the above Figure. It corresponds to Sriram Sagar (@ nearly 72kms) and this is only gravity dam built on Godavari.

Overall, Krishna drops from 1100ft+ (310mts+) to sea level in its entire journey in AP (starting just before Basara).

note: Ignore those spikes in the Figure. Knots just wandered a little bit while tracing Godavari in the map. They are just measurement errors.

Krishna River - Altitude profile

Using topocoding.com's API available to map the altitudes, I created the profile of Krishna River's altitude.

The starting point is at the tip of Karnataka and AP (Mehboob Nagar Dst.) from where Krishna flows exclusively in AP and the end point is Bay of Bengal, where Krishna terminates.

The total length, according to the profile plot, is about 582 kms. If you add about another 50+ kms of Karnataka-AP border, length of Krishna in AP will be about 630+ Kms. Of which, about 100kms exclusively flows in Telangana. Therefore, only less than 1/6th (or ~ 17%) of Krishna exclusively flows in Telangana. 70% of Krishna flowing Telangana, though factual, gives a wrong impression.

Shown below is the profile plot of Krishna River that flows between upstream Jurala and Bay-of-Bengal.



You can see three major dips in the plot, immediately followed by flat regions. They correspond to Jurala (@ nearly 20kms), Srisailam (@ nearly 180kms) and Nagarjuna Sagar (@ nearly 300kms). There is another flat region starting at nearly 400ksm, that should be the Prakasam barrage.

Overall, Krishna, drops from 900ft+ (300mts+) to sea level in its entire journey in AP (starting just before Jurala).

note: Ignore those spikes in the Figure. They are because, knots just wandered a little bit while tracing Krishna in the map. They are just measurement errors.

Disadvantage - Seema/Talangana



Shown above is the topological map of Andhra Pradesh.

  • Majority of telangana-seema is in the high altitude region. The Deccan peninsula is inclined eastwards (this makes me think that right canals would irrigate more area than left canals) making it much difficult to irrigate telangana region sandwiched between Godavari and Krishna. In which case, gravity based canals would be effective, only if they originate at the farthest points eastwards or northeastwards. But availability of water always decreases as we move upstream.
  • It would be much easier to construct and operate canals in the coastal delta.
  • It is not a coincidence that backward regions in AP have similar altitudes (or at least, have chunks of it) irrespective of whether rivers flow in those regions.
  • Building canals and water ways is a populist idea and conceptually looks good. But it is not as simple as building concrete highways/information highways or drawing imaginary political maps.

Krishna:

  • It is true that about 70% or more of both Krishna and Godvari flow in Talangana. However, this could lead to incorrect notions about the available water up-stream.
  • Only a stretch of Krishna flows exclusively in Telangana (in Mehboob Nagar Dst). The remaining stretch is shared (boundary) either by Seema/Karnataka or flows exclusively in Kosta (Guntur/Krishna Dsts.)
  • Its major tributary ( other than Bheema) Tunga-Bhadra joins Krishna at Kurnool-Mehboob Nagar boundary and since then it becomes a shared resource as mentioned before
  • Krishna-water basin is under closure, which means that the available water is being utliized completely or is fully committed. The only way new projects can be taken-up is by limiting/reducing already committed/serviced areas.
  • Circa 1951, Bombay state received an entitlement of 240tmcf, Mysore state 10 tmcf, Hyderabad state 280 tmcf, and Madras state 470 tmcf of Krishna water.
  • Krishna-1 and 2 projects near Akkampally are providing drinking water to Hyderabad from Nagarjuna Sagar. Apparently, these pipelines go through Naglonda district. My view is that there is not much water left for Nalgonda. Otherwise, drinking water could be supplied to Nalgonda form this project.
  • Krishna is not a perennial river and depends much on the rainfall in the western-ghats. It is only natural that downstream areas benefit from this. Nature does not care about politics but only follows the laws of Physics.
  • The K-C canal connects Krishna and Penna. A section of the Telugu-ganaga project is another link (terminating at Somasila on Penna)

Godavari:

  • Unlike Krishna, Godavari is not easy to tap, again due to its geography. Many of its main tributaries flow on the other side of the Godavari (except Manjira and few small tributaries). Like Krishna, it also depends on rainfalls (in Maharastra, Chattisghad and Orissa which make up much of the catchment area).
  • So far, only two alternate locations suitable for gravity-dams were identified upstream Dhavaleswaram, other than Sriram sagar. They are itchampally and polavaram. (Itchampally proposes to link Godavari with Krishna @ Nagarjuna Sagar)
  • Polavaram project was proposed and surveyed in the early 1940s. As per current drawings, it's left canal connects Krishna at Prakasam Barrage. It also hopes to provide 960MW (for lift projects upstream). But now a days, there is huge criticism for large projects, questioning their utility as a whole.
  • Itchampally was put on back burner due to political reasons and Polavaram was started without obtaining proper clearances. Only a man like YSR could do that. Prof. Kodandaram, who was convening the JAC, fiercely opposed Polavaram, citing environmental issues. It would be interesting to see what his take will be for the itchampally project
  • Around 40% of the annual discharge occurs just in a matter of few weeks during monsoons. This makes it very difficult to tap Godavari water.
  • Around, 90% of Godavari's discharge is due to the catchment area downstream Sriram sagar.

BASED on:

[1] Reforms in "Hyderbad Metropolitan Water Supply and Sewage board"
[2] Modeling water supply and demand scenarios: Godavari-Krishna inter-basin transfer, India
[3] Drawing water for thirsty lands: Stories of the closing Krishna river basin in south India
[4] Sponge city: water balance of mega-city water use and wastewater use in Hyderabad, India
[5] A History of water: water control and river biography
[6] Perspectives on Polavaram
[7] and my (poor) ability record, recall, process and analyze information


[1-4] WWW
[5-6] Google books or your library


IN the hope that it clears or creates more confusion,
BY an idiot who doesnt say "All is Well"
BUT says,
"We romanticize our rivers very much. Godavari at Basara pales in comparison to the Akhanda Godavari near Rajamundry. Only man-made diversions, with their bag of problems and destruction, can bring Konaseema/Diviseema greenery to the dry uplands".
Choice is ours.

27, డిసెంబర్ 2009, ఆదివారం

ఊహాజనిత విభజన రేఖలు



ఈ ఫొటొ, ఆం.ఫ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంనాడు తెలంగాణా లో ఒక చిన్నారి వేషం. ఈ రోజు సమైక్యతారాగం ఆలపిస్తున్న అధిక ప్రజలు కూడా, తెలంగాణా విడిపోతామంటే ఇలాంటిక్షోభనే అనుభవిస్తున్నారు. మా పరిస్థితి ఈ చిన్నారికి, పరోక్షాంగా ప్రభవితులైన భావి భారత పౌరులకు ఎదురుకాకూడదని కోరుకుంటున్నాను.

మరొక వైపు, తెలంగాణాకు అడ్డొస్తే, అడ్డంగా నరుకుతాం అంటూ నినాదాలూ. ఇది అణచివేతకి ప్రతిరూపమా, విధ్వేషానికి పరాకాష్టా?

హు ...

ఊహాజనిత రేఖలు - ఊహలకందని కల్లోలం
ఎందుకీ సమైక్య రాగం
ఎందుకీ విభజనవాదం
నాకెందుకీ ఆరాటం, ఎవరికోసం?

26, డిసెంబర్ 2009, శనివారం

గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణా


ఇలాంటి గోడని సరిహద్దు ప్రాంతమంతా కట్టి, గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణా నిర్మించిన విప్లవ వీరులుగా ఖ్యాతి గడించి, చరిత్ర పుటల్లో స్థానం సంపాదిద్దామా?

లేక

వీటిని కూలగొట్టి, అభివృద్ధికి ఇవే అసలైన అడ్డు గోడలని ఋజువు చేద్దామా?

23, డిసెంబర్ 2009, బుధవారం

ఘోషయాత్రలో సమైక్యతారాగం - అరణ్య రోదన

who moved your cheese Prof. Jayashankar?

నా ప్రశ్న కి వివరణ


నేను తెలాంగాణా వెనుకబాటుతనంపై ఉద్యమాన్ని వ్యతిరేకించటంలేదు. అందుకు, మీరెంచుకున్న మార్గమేంటీ, చేరబోతున్న గమ్యమేంటి. ఈ ఉద్యమానికి రాజు కె.సీ.ఆర్ అయితె, ప్రొ. జయశంకర్ & కో మంత్రులు లాంటి వారు.

ప్రొ. జయశంకర్ గారు, వైస్ చాన్సలరు గానే కాకుండా అనేక ఉన్నత స్థానాల్లొ, విద్యాలయాలలకి సలహాలూ, సూచనలూ ఇచ్చిన వ్యక్తి. దశబ్దాలనుంచీ తెలంగాణా వెనుకబాటుతనంపై పోరాటం చేస్తున్న వ్యక్తి.

ఉద్యమం దారి తెప్పిందని నేను నమ్ముతున్నాను. కాబట్టి సిద్ధాంత కర్త సిద్ధాంతాల్ని ప్రశ్నిస్తున్నాను. దీన్ని పొగరుబోతుతనం అన్నా పర్వాలేదు. ప్రశ్నినించే అర్హత, హక్కుల మాటకొస్తే, ఆం.ఫ్రా, నా రాష్ట్రం, ఇలా తగలబడిపోతూ ఉంటే, గళం విప్పడం నా బాధ్యత. ఒక విధ్యార్ధిగా ప్రశ్నించించడం నా ప్రాధమిక హక్కు. ప్రశ్నల్ని స్వాగతించడం ఆచార్యుల కనీస బాధ్యత.

సమైక్యత అంటే, తెలంగాణా ని విమర్శించడతనం కాదు. విభజన పరిహ్కారం కాదు అని భావిస్తున్నవాళ్ళ భావం. మీ నోటి కింద కూడు లాక్కునే దుర్మార్గపు ఆలోచనలు మాలాంటి సామాన్యులకి ఇంకా అబ్బలేదులెండి. దయచేసి ఇలాంటి పసలేని ఆరోపణలు చెయ్యకండి.

రాజకీయనాయకులు, కిలో రెండు రూపాయలు, ఉచిత విద్యుత్తు, భూమి పట్టాలు, కలర్ టీవీలు అంటూ ప్రజలని ప్రలోభపెట్టి వాళ్ళని సోమరిపోతులని చేస్తున్నాయి. రాష్ట విభజన. ఈ తాయిలాన్ని ఒక సిద్ధాంత కర్త ఆమోదించడాన్ని నేని ప్రశ్నిసున్నాను,

ఇంక విద్యార్ధులెన్ను కున్న మార్గాలు. ఓ.యూ లో ధర్నాలు, బస్సులు పగలగొట్టడాలూ. పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లు, మిగతా ప్రాంత విద్యార్ధులు కూడా అదేపని. ప్రాంతాలకతీతంగా, పట్టుమని పదహారేళ్ళులేని ఆడ పిల్లలు, పరప్రాంత నాయకుల దిష్టిబొమ్మలని తగలబెట్టడం, వాటిని చెప్పులతో కొట్టడం. ఈ విష సంస్కృతిని మనం ఆదరిస్తున్నాం. అమ్మాయలపై రౌడీ మూకల ఏసిడ్ దాడులకి దీనికి మీకు సారూప్యత కనిపించడం లేదా? పెట్టిన కేసులు ఎత్తివేయాలని మరిన్ని ధర్నాలు. ఉద్యమాలు విద్యార్ధుల చేతిల్లోకి వెళ్ళిపోయిందని జబ్బలు చరుచుకోవడాలూ. అంటే, మనం ఇప్పటినుంచే చట్టాన్ని తుంగలా తొక్కే చట్టుబండ నాయకులని చప్పట్లు కొట్టి మరీ తయారు చేస్తున్నాము కదా?

ఇంతకీ అసలు ఏమి అభివృద్ధిని మీరు కాంక్షిస్తున్నారు. కోస్తా సీమాల్లో ఉన్న అభివృద్ధి ఒక మేడి పండు లాంటిది. కాలేజీలు కోస్తాలో ఉన్నన్ని లేవు అని ఎవరో అన్నారు. కాలేజీలు ఎలా నడిపిస్తారో మీకు తెలుసా. అధికారులని కొనేసి, అధ్యాపకులని అరువు తెచ్చుకొని, కాగితాలమీద నడిపిస్తారు. ఇలాంటి కాలేజీలు, చదువులు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఈ విషయాయం మీ ఆచార్యవర్యులకు తెలీదనుకోవాలా? అందుకే విద్యరంగంలో నిపుణులైన మీ సిద్ధాంతకర్త గారి సిద్ధాంతాలని ప్రశ్నిస్తున్నాను.

విభజన ఒక మార్గం. మీరు పోరాడవలసిన అసలు సమస్య ఇది కాదు, అని నా విశ్వాసం. ఇది చెప్పడానికి సమైక్యవాదినే అవ్వాల్సిన అవసరం లేదు. ఏ భారతీయుడైనా, ఏ మానవుడైనా సూచించ వచ్చు. ఇది సార్వజనీనమైనది.

ఒక వేళ విభజన జరగాల్సిన పరిస్థితి వస్తే, దానికి రాజీ మార్గాలు ఎన్నుకోవాలి. ఎవ్వరూ తగ్గకుండా ఈ జఠిలమైన విభజనకి పరిష్కారం కుదరదు. అందుకు మీరు మానసికంగా సన్నిద్ధులు కండి. విభజన జరిగే పక్షంలో, ఈ మేడి పండు అభివృదిని కాకుండా నిజమైన అభివృద్ధిని కాంక్షించండి.
Replenish your think-tanks
Not just water tanks
ఒక సమైక్యవాదిగా ఇది నా అత్యాశ. నా మాటలు చాలమందికి రుచించవని నాకు తెలుసు. నా సిద్ధాంతాలు తప్పూ కావచ్చు.
ఘోషయాత్రలో సమైక్యతారాగం - అరణ్య రోదన
అన్నదే మీ అభిప్రాయమైనా , విచక్షణ ఉపయోగించి ఆలోచించండి. అది చాలు!

I opposed "dividing the state" Explained/Analyzed why. Suggested a compromise.

I accept any decision.

Peace out.

22, డిసెంబర్ 2009, మంగళవారం

ప్రొఫెసర్. జయశంకర్: మీ వెన్న దొంగ ఎవరు?

కె.సీ.ఆర్ మాటల్లో, ఒక తెలంగాణలో స్కూలు పిల్లవాడినడిగినా చెబుతాడు, "మనకి ప్రత్యేక రాష్ట్రం ఎందుకు చెప్పరా" అంటే, ఇలా
1) తెలంగాణా కి అన్యాయం జరిగింది.
2) భాషను గేలీ చేసేరు.
3) జాతి ని అవమానించేరు.
4) వివక్ష చూపేరు.
5) దురాక్రమణ దారులు శతాబ్దాలుగా దోచుకుతింటున్నారు
...... అంటూ మరెన్నో

ఒక తెలంగాణా చరిత్రకారుణ్ణి అడిగితే,
నాలుగువందల పైచిలుకు సంవత్సరాలుగా, బానిసత్వంలో బతికాం. పాలకుల దాష్టీకానికి గురైన బంగారు పిచుక తెలంగాణా. పోరాటాల పురిటి గడ్డా మా తెలంగాణా + పై పిల్లాడి కారణాలు

ఒక కళాకారుడ్ని అడిగితే,
డప్పుతో దరువేస్తూ, లయబధమైన గజ్జెల జప్పుడుతో,
ఎవడురా, ఎవడురా,
తెలంగాణకు అడ్డెవడురా, + పై పిల్లాడి కారణాలు
అని పాడుతుంటే, ప్రాంతాలకతీతంగా ఎవరికైనా ఉద్రేకం కలుగుతుంది. పోరాట స్ఫూర్తి రగులుతుంది. మేము కూడా పలుపంచుకుంటాం అనాలనిపిస్తుంది. కదా?

పై చెప్పినవాటినే మరొక్కసారి పరీక్షిద్దాం.
-- [ ... నాలుగువందల పైచిలుకు సంవత్సరాలుగా, బానిసత్వంలో బతికాం ...]
-- [ ... పోరాటాల పురిటి గడ్డా మా తెలంగాణా ...]
-- [... ఎవడురా, ఎవడురా,
తెలంగాణకు అడ్డెవడురా ...]

ఇలా నాలుగువందలేళ్ళుగా, పోరాడుతునే వున్నాం. మళ్ళీ పోరాడుతునే వున్నాం.
కానీ ఎవరితో? ఇంకా ఎన్నాళ్ళు? వీటిలో వైఫల్యం ఎవరిది?

ప్రొఫెసర్. జయశంకర్ గారూ.
మనం మనతో పోరాడితే విజయం లభిస్తుంది. తద్వారా, సంఘమూ విజయం సాధిస్తుంది.
ఎదుటి వారితో పోరాడుతూ వుంటే, నిరంతరం పోరాడుతూనే ఉండవలసివస్తుంది. అంతర్గత పోరాటలతో, మహా సామ్రాజ్యాలూ, సంస్కృతులూ మట్టికొట్టుకొనిపోయాయి. పోరాటినికి సై సై అంటున్న సైనికుల భావ బానిసత్వంపై పోరాటం ప్రకటించండి, వారిని విముక్తుల్ని చెయ్యండి. అప్పుడు తెలంగాణ, సీమ, కోస్తాలే కాదు, ఆసేతుహిమాచలమూ కళ కళ లాడుతుంది.

దీన్ని
గాంధీ నిరాహారక్ష తేదు
నెహ్రూ పంచవర్షలు తేలేదు
ఇందిర ఇరవై సూత్రాలు తేనేలేదు
పి.వి. చాణక్యత తేదు
బూర్గుల కలంపోటు తేలేదు
చెన్నారెడ్డి వెన్నుపోటు తేనేలేదు

బాబు గారి ఐ.టి తేదు
వై.ఎస్.ఆర్ జల యఙ్ఞం తేలేదు
ఎన్.టీ.ఆర్ రెండు రూపాయలు తేనేలేదు

అంతే కాదు

జె.పీ స్వపరిపాలనతో రాదు.
చిరు పెను మార్పులతో రాలేదు
రోశయ్య బంట్రోతు బిళ్ళ తేదు
బాబు గారి మౌనం తేలేదు
లగడపాటి ధన యఙ్ఞం తో రాదు
కే.సీ.ఆర్ రాష్ట్ర విభజనతో రాలేదు
మీ సివిల్ వార్ ధంకీలతో అంత కన్నా రాలేదు.

ఒక్క సంస్కరింపబడిన విద్య ద్వారా మాత్రమే సాధ్యం. అటువంటి విశ్వవిద్యాలయాలు మనకి లేవు. వాటిని పోషించే పాలకులు లేరు. ఆ సంపదని అభివృద్ధి పరచే విద్యార్ధులు అసలే లేరు.

మీరు ఆ దిశగా చర్యలు చేపట్టండి.
జై తెలంగాణా అంటూ గొంతెత్తి నినదిస్తాం.
మీ కాలు మొక్కుతాం బాంచెన్

btw, who moved your cheese Prof. Jayashankar?
- ఒక సమైక్యవాది ప్రశ్న

Collapse: How Societies Choose to Fail or Succeed

I wish that everyone engaged with the current state of political affairs in A.P reads the book

"Collapse: How Societies Choose to Fail or Succeed"

by Prof. Jared Diamond


If you dont get a copy of the book, you can watch a video

here

21, డిసెంబర్ 2009, సోమవారం

సమైక్యాంధ్ర ఉద్యమ నిర్వహణలో లోపాలు

సమైక్యాంధ్ర కోసం ఉద్యమం*: ఎందుకు ఎవరితొ, ఎక్కడా, ఎలా?

ఎందుకు:
సగం మంది దగ్గర సమాధానం ఉండదు. (విడిపోవడానికి చెప్పినంతా సులువుగా, కలిసుండడానికి కారణాలు చెప్పడం కష్టం. ఋజువుల సంగతి సరే సరి. ఉదాహరణకి: అణచివేత, వివక్ష, దోపిడీ, ఆత్మగౌరవం. ఎలాంటి వారు విడిపోవడానికైనా, ఈ కారణాలు చెప్తే చాలు కదా!)


ఎవరితో:
మాతో సమైక్యంగా ఉండండని, ఉండగోరే వాళ్ళతో పోరాటం. ఎంత విచిత్రం

ఎక్కడ:
తెలంగాణా వాళ్ళతో సఖ్యతకోసం, సీమ - కోస్తాల్లో. మరీ విచిత్రం

ఎలా:
కొబ్బరి చెట్లు ఎక్కి, శవదహనాలు చేస్తూ, పిండాలు పెడుతూ, పాలాభిషేకాలతో, రైళ్ళు-బస్సులు-సమస్తం - ధ్వంసం చేస్తూ, అర్ధ-నగ్న ప్రదర్శనలు చేస్తూ --
(ఇలాంటి విడ్డూరాలకి మనం అలవాటుపడిపోయాం. తెలంగాణా వాదుల "జాగో-భాగో, " లు తక్కువేమీ కాదనుకోండీ)

ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తోంది. సమైఖ్యతా భావన సడలిపోవడానికి ఇంతకన్నా వేరే కారణాలు కావాలా?


* ఈ టపా బ్లాగుల్లో జరుతున్న చర్చలని దృష్టిలో పెట్టుకుని రాసినిది కాదని మనవి

తెలంగాణా-సమైక్యాంధ్రా ఉద్యమాలకి మూలకారణం ఎవ్వరు?

1) ఏ ప్రాంత ప్రజలైనా స్వార్ధపరులే. అందులోంచి వచ్చిన రాజకీయనాయకులు నీతిమంతులు కావలనుకోవడం అమాయకత్వం.

2) తెలంగాణ వాళ్ళు చేస్తున్న పోరాటం, వాళ్ళకోసమే. వీధినపడి ధర్నాలు చేస్తున్న సమైక్యవాదులు చేసే పోరాటం కూడా, వారి స్వప్రయోజనాల కోసమే

3) మా ప్రాంతం వెనకబడిందంటే, కాదు మాది మాదంటూ, ఇలా వెనుకబాటుతనంలో పోటీ పడుతున్నామంటే, అసలు అభివృద్ధిని ఆకాంక్షించే అర్హత మనకుందా?

4) “ప్రజల మనోభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకునేది మా పార్టీ” అని ఈరోజు ప్రతీ పార్టీ చెప్తోంది. ఇలా ఆలోచించే వాళ్ళు అసలు లీడర్సు, పాలసీ మేకర్స్ ఎలా అవుతారు?

5)* ప్రజలు బద్దకస్థులు. ప్రస్తుత కాలంలో విద్య, రాజకీయాలు, ఈ రెండూ పనికిరాని కుళ్ళిపోయిన వ్యవస్థలు. ఉస్మానియా అయినా, ఆంధ్ర విశ్వవిద్యాలలయమైనా, మరేదైనా, అవినీతి పంకిలాలు*. విద్యార్ధులతో సహా! ఎవడు సరిగ్గా చదివి పాసయ్యాడు? సరిగ్గా క్లాసులకి హాజరౌతాడు? హాస్టల్స్ లో జరిగే అసాంఘిక కార్యకలాపాలకు అసలు లెక్కేదీ? ఈ వ్యవస్థలో ఎవెరు నీతిమంతులు, నిజాయితీపరులు? ఇందులోంచీ పుట్టిన ఉద్యమాలు ఎంత పవిత్రం. (అది ఓ.యూ తెలంగాణా అయినా, ఏ .యూ సమైక్యాంధ్రా అయినా).

6) ప్రతీ మనిషి ప్రభుత్వం మీదే ఆధారపడాలనే పరాధీన మనస్తత్వం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఎదురు చూసి మోసపోవడమే ప్రస్తుత సమాజ దుస్థితి.


ప్రజలచేత, ప్రజలకోసం, ప్రజల కొఱకు ఏర్పడిన వ్యవస్థ ఒక పరిష్కారం చూపలేకపోయింది అంటే అది ఎవరి లోపం.

దానికి మూల స్తంభాలైనప్రజల స్వార్ధానిదా? అందులోంచి పుట్టి, ప్రజల అభిప్రాయమని, పార్టీ గతి-గమ్యాలని గాలివాటంగా మార్చే, రాజకీయనాయకులదా?

యథా ప్రజా - తథా రాజా

ఉదాహరణకి,
గ్రామీణ వెనుకబాటు లో అగ్రస్థానం ఏ జిల్లాదో తెలుసా?
ఒకప్పటి ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని విజయనగరం. ఈ జిల్లా కాంగ్రెసు మంత్రి కుటుంబం నుంచి నలుగురు వ్యక్తులు శాశన సభ్యులు లేదా పార్లమెంటు సభ్యులు. జిల్లా ఎంత వెనుకబడిందో, వీరి ప్రైవేటు ఆస్తులు అంత వృద్ధి చెందాయి. ప్రజలారా కళ్ళు విప్పండి.

ప్రజలు మారితే, పాలకులు మారతారు.
పాలకులు మారితే పాలన మారుతుంది.

దీని కోసమే కదా ఉద్యమాలు. లేని పక్షంలో,
తిరోగమనానికి మరిన్ని కొంగొత్త కారణాలకై నిరంతర అన్వేషణ కొనసాగుతుంది


* ఇది కొంతమందిని బాధించే విషయమైనా, సత్యదూరం కాదు.

20, డిసెంబర్ 2009, ఆదివారం

తెలంగాణా ఉద్యమ నిర్వహణలో లోపాలు

ప్రస్తుతానికి రాజకీయనాయకులని పక్కన పెడదాం. ఈ ఉద్యమం ఫలితం ఏదైనా, అది మూడు ప్రాంతాల తెలుగు వాళ్ళనే కాకుండా దేశాన్ని ప్రభావితం చేసే అంశం. అటువంటిదాన్ని చాలా హ్రస్వ దృష్టితో నిర్వహించారు.

1956 తరువాత, గత ఏభై ఏళ్ళలో ఎంతోమంది కొస్తా-సీమ ప్రాంతవాసులు హైదరాబాదు పరిసరప్రాంతాల్లొ నివాసాలు, జీవనోపాధి కల్పించుకున్నారు. తెలంగాణా అంశం ముందుగా వీరిని, తద్వారా అనేకమంది కోస్తా-సీమ వాసుల్ని ప్రభావితం చేస్తుంది.

అలాగే ఇప్పటి తరం విద్యార్ధులు, ఆం.ప్ర గురించి తమ పాఠ్యాంశాలలో చదువుకున్నారు. వీరందిరికి విడిపోవడాం అనేది జీర్ణించుకులేని విషయం. ఏదో కోల్పోతున్నామే అనే తెలియని బాధ. ఉద్యమ లక్ష్యాలు, స్వరూపాలు వేరైనా, "కాశ్మీరు విడగొట్టండి" అనే ప్రతిపాదన ఎలాంటి భావోద్రేకాల్ని రేకెత్తిస్తిందో, తెలంగాణా విభజన అదేస్థాయి ఉద్రేకాన్ని కలిగిస్తుంది ( కనీసం నా వరకైనా). అలాగే, కోస్తా-సీమ వాసుల్ని దోపిడీ దారులు, దురాక్రమణదారులు అనడం కూడా (దీన్ని కె.సీ.ఆర్ తర్వాత ఖండించినా గానీ)

ఇటువంటి సున్నితమైన అంశం పట్టుకుని, ఎక్కడ అంధ్రా పేరు కనిపిస్తే, దానికి తెలంగాణా పేరు తగిలించడాం, భాగో-జాగో లంటి నినాదాలు, దురాక్రమణ దారులు-దోపిడీ దారులు అనే ఆరోపణలు, సానుభూతి ఉన్నవాళ్ళని కూడా దూరం చేస్తాయి. అలాగే, పోటీగా తెలంగాణా తల్లికి పిల్లలు ప్రాణం పోయడం అనవసరం.

ఇవేవీ కాకుండా, మనం విడిపోయినా తెలుగు తల్లికి రెండు కళ్ళలా మెదలుదాం, లాంటి పాజిటివ్ ఇమేజ్ తీసుకొచ్చుంటే, కొస్తా-సీమల్లో ఇంత నిరసన వచ్చేది కాదు. అంతటితో సరిపెట్టకుండా, చిన్న రాష్ట్రాల వలన పరిపాలనా సౌలభం కూడా వివరించి ఉంటే, వారి నుంచి కూడా మీకు మద్దత్తు ఉండేది.

తెలంగాణా ఏర్పడకపోతే, సివిల్ వార్ (జయశంకర్ ఉవాచ), అణువిస్ఫోటణం (కె.సి.ఆర్ ఉవాచ) జరగడానికి ఎంత సంభావ్యత ఉందో, కోస్తా-సీమ వాసుల అభిప్రాయాలని పరిగణించనప్పుడూ అంతే ఉంటుంది. పర్యవసానాలు అన్ని ప్రాంతాలవాళ్ళూ అనుభవిస్తారు. ఒకరికి లాభం ఒకరికి నష్టం రావు, యుద్ధమే వచ్చినప్పుడు.

నాకు తెలంగాణా ఉద్యమం పై సానుభూతి ఉన్నా సమైక్యంగా ఉండాడాన్నే కోరుకుంటాను. కొస్తా-సీమల్లో వినిపిస్తున్న ఉద్యమ రాగాలని స్పాన్సర్డ్ గీతాలుగా సంభోదించడాన్ని వ్యతిరేకిస్తున్నాను.

ప్రతీ ఒక్కరూ "అంతమంది ప్రజలకీ ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయం తీసుకుంటాం" అంటారేగాని, అదేంటో చూపే ప్రయత్నం చెయ్యరు. తెలంగాణా ఉద్యమకారులు రాజీ పరిష్కారాలు ఆలోచించండి. ఈ పీట ముడి విప్పడానికి సహకరించండి.

నాకు వచ్చిన ఆలోచన ఇక్కడ

(నాకు హైదరాబాదు తో గానీ, తెలంగాణా తో గానీ సంబంధ-బాంధవ్యాలూ లేవు. అసలు ప్రత్యేక కోస్తావే లాభదాయకం!!!)

18, డిసెంబర్ 2009, శుక్రవారం

తెలంగాణా సమస్య - ఒక రాజీ పరిష్కారం

తెలంగాణా విభజనవాదులు: ప్రత్యేక రాష్ట్రం కావాలిసిందే. ఎందుకంటే
1) మా వనరుల మీద అధికారం మాకే కావాలి
2) ఎన్నోసార్లు రాజకీయనాకుల చేతిలో మోసపోయాం. దోపిడీలకు గురయ్యాం. ఇక మావల్ల కాదు
3) చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యపడుతుంది
4) తెలుగు వారమైనా మా సంస్కృతి, సాంప్రదాయం వేరు. ఈ బలవంతపు వివాహం నుంచి మాకు విడాకులు కావాలి.
5) నిధులు, వనరుల పంపిణేల్లో, అన్యాయానికి గురి అవుతున్నాం.
6) సమైఖ్యాంధ్రా కోరుకునే వాళ్ళకి నిజంగా హైదరాబాదే కావాలి. హైదరాబాదు తెలంగాణాలో అంతర్భాగం. ఇది నైజాముల కాలంనుంచే అభివృద్ధి చెందిన నగరం. మీరొచ్చి కొత్తగా ఊడబొడించింది లేదు.

భౌగోళికంగా వేరైనా మానసికంగా కలిసుందాం (లేదా అందుకు ప్రయత్నిద్దాం)

సమైఖ్యాంధ్రా కోరుకునే వారు:
1) అసలు విడిపోవడమన్నదే పరిష్కారం కాదు. కలిసి ఉంటే కలదు సుఖం. చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి సాధ్యం (ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో) కాకపోవచ్చు.
2) రాష్ట్ర విభజన వల్ల అనర్ధాలు ఎన్నో. ఇది రాష్ట్ర సమస్యేకాదు. జాతీయ భత్రతో ముడిపడి ఉన్న సమస్య కూడా. నక్సాలిజం, తీవ్రవాదం, వేర్పాటువాదం వంటివి మరింత ప్రజ్వరిల్లవచ్చు.
3) ఇన్నాళ్ళు మీ ప్రాంత రాజకీయనాకులు వెలగబెట్టిందేంటి? ఇది రాజకీయనాయకులు స్వప్రయోజనాలకోసం, తమ ఉనికి కోసం తిరగదోడిన సమస్య. అయినా రాయలసీమ వెనకబడి లేదా? ఉత్తరాంధ్రా వెనకబడిలేదా. మీ వెనకబాటుదనానికి అంధ్రావాళ్ళని దోపిడీ దారులనడం, నిజంగా గర్హించవలసిన విషయం.
4) ఇక ముఖ్యంగా, హైదరాబాదు లో నివాసం, వ్యాపారాలు వృద్ధి చేసుకున్నవారి పరిస్థితి ఏంటి. వాళ్ళకి భద్రత ఏది. మీరిచ్చే వాగ్దానాలు తుంగలో తొక్కరన్న నమ్మకమేమిటి. ఇన్నాళ్ళూ మేము కూడా, హైదరాబాదు అభివృద్ధిలో పాలుపంచుకున్నాం. మేము పోషించినా హైదరాబాదు మాకు లేకపోవడం అన్యాయం.
5) ఒకవేళ తెలంగాణా వచ్చిన పరిస్థితులలో, ముఖ్యంగా, నీళ్ళ దగ్గర, ఇతర రాష్ట్రాల్లాతోవాళ్ళాలాగే తగవులాడుకోవాలి.

ఇప్పుడు ఎలా వుంది అంటే, కరవమంటే కప్పకి కోపం, విడవ మంటే పాము కోపం లాగ తయరయ్యింది. అసలు కథ ఇంత దూరం వచ్చిన తరువాత, కలిసున్నా విడిపోయినట్టే. ఈ పీటముడి ఇప్పడానికి, నాకు హైదరాబాదు, జలవనరులపై ఆధిపత్యం ప్రధాన అడ్డంకులుగా కనిపిస్తున్నాయి.




కాబట్టి నేను సూచించే పరిష్కారం, రాష్ట్రా విభజన ముఖ చిత్రాన్ని మార్చి, విభజన చేయటం. కాకపోతే, రెండు సమూహాలూ పట్టువిడుపులు ప్రదర్శించాలి. (ప్రక్క పటం చూడాండి. నీలి రంగు గీత కొత్త విభజన రేఖని సూచిస్తుంది)

1) రాయలసీమ, కోస్తాంధ్రలలో, మెహబూబ్నగర్, సగం రంగారెడ్డిని ని కలపాలి. అంటే, తెలంగాణా ఒక జిల్లాని కోల్పోవాలి. అలాగే సగం రంగారెడ్డి కూడా. సీమాంధ్రలు, విభజనకి అంగీకరించాలి.
2) హైదరాబాదు ఉమ్మడి రాజధాని గా చెయ్యాలి
3) రెండు కొత్త రాష్తాల మధ్య కొన్ని ప్రత్యేక అవగాహనలు ఉండాలి (వాహనాలు, జలవనరులు, రవాణా ఇలాంటి విషయాల్లో)
4) క్రిష్ణా పై అధిక హక్కులు సీమాంధ్రకి వస్తాయి. గోదావరిపై నియంత్రణ తెలంగాణాకి లభిస్తుంది.
5) నాగార్జునసాగర్ పై రెండు రాష్ట్రాలకి హక్కులు ఉండాలి.
6) హైదరాబాదు ని ఫ్రీజోన్ గా కాకుండా, ఫ్రోజెన్ జోన్ గా ప్రకటించాలి. ప్రత్యామ్నాయంగా మూడు ప్రాంతాల్లో (తెలంగాణా, రాయలసీమ, కోస్తాల్లో ఒకటి చొప్పున), మూడు ప్రాంతాలని అభివృద్ధి పరచాలి (అభివృద్ధి వికేంద్రీకరణ కోసం)

అలోచించవలసిన విషయం:
తెలంగాణా వాదులు: ఇప్పుడు మీరు మహబూబ్ నగర్, సగం రంగారెడ్డిని కోల్పోతున్నారు. హైదరాబాదు ని పంచుకుంటున్నారు. ఇప్పుడు మీకు అర్ధమవుతోడా, విడిపోవడం, విభజనలో బాధ? మీరు నిజంగా, తెలంగాణా అభివృధి కాంక్షించేవారే అయితే, మహబూబ్ నగర్ సీమాంధ్రలో వున్నా, తెలంగాణాలో ఉన్నా పెద్ద తేడా ఉండదు, ఇప్పుడు రెండూ చిన్నా రాష్ట్రాలే కాబట్టి.

తెలంగాణాలో, గోదావరీ పరివాహక ప్రాంతమే ఎక్కువ కాబట్టి, దానిపై ఎగువ నియంత్రణ మీచేతికిందకే.

సమైఖ్యవాడులు: దీనివలన, హైదరాబాదు పై అనవసర ఆందోళణలు అక్కర్లేదు (ఉమ్మడి రాజధాని కాబట్టి). క్రిష్ణా పై అధిక నియంత్రణ వస్తుంది. ఏదో ఒకటి వొదులుకోక తప్పదు కాదా, విభజన అన్న తరువాత. అసలు కొంతమంది తెలంగాణావాదుల వాదన చూస్తే, వాళ్ళ ఆరోపణలకి మనసు విరిగిపోతుండి. కలిసుండి వేర్వేరుగా ఉండేకన్నా, విడిపోయి కలిసుండడమే ఉత్తమమేమో.


(ఇది ఒక ప్రతిపాదన మాత్రమే. నాకున్న సమాచారంతో ఈ సూచన చేయడం జరిగింది. ఎవరి మనసు నొప్పించినా క్షమించ గలరు. ఈ టపా పై నేను మరి ఇక వ్యాఖ్యానించను.)

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును