20, ఆగస్టు 2010, శుక్రవారం

రాముడు. ముదమున ఖురాను చదివె

శంకరాభరణం బ్లాగరి ఆచార్య కంది శంకరయ్య గారిచ్చిన సమస్యాపూరణం
1. రాముని జంపి హర్షమున రాక్షసు లెల్లరు నాట్యమాడరే

నా పూరణ
ఉ||
క్షామముతోడిరాజ్యమున గద్దలు భిక్కుల భక్షమైననూ
కామమదమ్ములందు గురిగల్గిన శిక్షకులుండుటే నిజం.
క్షేమము లేనియా వికృతకేంద్రములో దయ విస్మరించి యా
రాముని జంపి హర్షమున రాక్షసు లెల్లరు నాట్యమాడరే

2. రాముడు ముదమున ఖురాను చదివె
నా పూరణ
కం||
నరలోకపు భూకబ్జా
సురులంతంబొందగ సురసురమని విడిచెన్
శరములు రాముడు. ముదమున
ఖురాను చదివెను రహీము కుశలము తోడన్.


కామెంట్‌లు లేవు:

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును